
బుల్లితెర నటి దల్జీత్ కౌర్ తన రెండో వివాహం విడాకులతో ముగియడంపై తీవ్రంగా స్పందించింది. మోసం, మానసిక హింస ఆరోపణలు చేస్తూ, క్షమాపణ కోసం ఆమె పోరాటం ప్రారంభించింది.
Key Points
దల్జీత్ కౌర్ రెండో వివాహం విడాకులతో ముగిసింది.
మోసం, మానసిక వేధింపుల ఆరోపణలు నిఖిల్ పటేల్ పై ఉన్నాయి.
నిఖిల్ పటేల్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కెన్యా నుండి భారతదేశానికి తిరిగి వచ్చింది.
నిఖిల్ పటేల్ తో విడాకులు
బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ చెప్పాల్సిన పనిలేదు . సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది . మొదటి భర్తతో విడిపోయినా ఆమె .. రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు . వ్యాపారవేత్త నిఖిల్ పటేల్ ను రెండో పెళ్లి చేసుకోగా .. ఆతర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు . 2023 లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కగా కొన్ని నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు .
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దల్జీత్ కౌర్ తన విడాకులపై మరోసారి మాట్లాడింది . తన మాజీ భర్త నిఖిల్ పటేల్ పై విమర్శలు చేసింది . విడిపోయాక తన లైఫ్ లో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను పంచుకుంది . ఈ విషయంలో నిఖిల్ పటేల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది . ఈ విషయంలో మాత్రం తాను మౌనంగా ఉండనని స్పష్టం చేసింది . అతను క్షమాపణ చెప్పేవరకు పోరాటం చేస్తానని దల్జీత్ కౌర్ తెలిపింది .
మోసం మరియు మానసిక వేధింపులు
దల్జీత్ కౌర్ మాట్లాడుతూ .. ‘ పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది . కానీ నా లైఫ్ లో మళ్లీ ఇలా జరగడం చాలా కోపం తెప్పించింది . ఈ విషయంలో తాను మౌనంగా ఉండనన్న విషయం నిఖిల్ తెలుసుకోవాలి. అతను నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే . ఈ విషయంలో నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా . నాకు అతని వద్ద నుంచి క్షమాపణ రావాలి. దానికోసం ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్తా ‘ అని అన్నారు.
కాగా .. నిఖిల్ తో పెళ్లి తర్వాత కెన్యా వెళ్లిన ఆమె కేవలం పది నెలలకే ఇండియాకు తిరిగొచ్చింది . తన కుమారుడితో సహా వచ్చిన తర్వాత అతనిపై తీవ్ర విమర్శలు చేసింది . నిఖిల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అతనికి మరొకరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని .. తనను మానసిక వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది . ఆ తర్వాత నిఖిల్ తన స్నేహితురాలు సఫీనా నాజర్తో కూడా ముంబయిలో కనిపించారు .
క్షమాపణ కోసం పోరాటం
కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కావడంతో రెండో పెళ్లి చేసుకున్నారు .
దల్జీత్ కౌర్ తన భర్త నుండి క్షమాపణ కోసం పోరాటం చేస్తూ, తన అనుభవాలను బయటపెట్టింది. ఈ వివాదం తెలుగు సినీ ప్రేక్షకులలో చర్చనీయాంశంగా మారింది.


