
ఇడ్లీ కడై ట్రైలర్ లాంచ్ లో ధనుష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలకు ముందు వచ్చే ఫేక్ రివ్యూల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Key Points
ధనుష్ ఫేక్ సినిమా రివ్యూలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సినిమా విడుదలకు ముందే వచ్చే రివ్యూలను నమ్మవద్దని అభిమానులకు హెచ్చరించారు.
ఆరోగ్యకరమైన సినిమా వాతావరణం అవసరమని ధనుష్ అభిప్రాయపడ్డారు.
ఇడ్లీ కడై/ఇడ్లీ కొట్టు సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఫేక్ రివ్యూలపై ధనుష్ ఆగ్రహం
కోయంబత్తూరులో జరిగిన ఇడ్లీ కడై ట్రైలర్ లాంచ్ సందర్భంగా నటుడు, చిత్ర నిర్మాత ధనుష్ ఫేక్ రివ్యూస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియా సమీక్షలను నమ్మవద్దని తన అభిమానులకు జాగ్రత్తలు చెప్పాడు. మూవీ మార్నింగ్ షో కాకముందే కొంతమంది రివ్యూలు పెడుతున్నారని అతనన్నాడు. తన సినిమా విషయానికి వస్తే ఇలాంటి సమీక్షలను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరాడు. సోషల్ మీడియా రివ్యూలను పట్టించుకోవద్దన్నాడు.
”సినిమా ఉదయం 9 గంటలకు రిలీజ్ అవుతుంది. కానీ గంట ముందుగానే ఉదయం 8 గంటలకే కొన్ని రివ్యూ లు వస్తాయి. దయచేసి అలాంటి సమీక్షలను నమ్మవద్దు. ఒక సినిమా ఉదయం 9 గంటలకు విడుదలైతే, మధ్యాహ్నం 12:30 గంటలకు మాత్రమే సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు” అని ధనుష్ పేర్కొన్నాడు.
అభిమానులకు ధనుష్ హెచ్చరిక
“సినిమా ముగియకముందే చాలా సమీక్షలు వస్తాయి. దయచేసి అలాంటి సమీక్షలను నమ్మవద్దు. సినిమా చూడండి. మీరే నిర్ణయించుకోండి లేదా దానిని చూసిన స్నేహితుడిని అడగండి. ఈ సినిమా చూడాలా వద్దా అని మీరే నిర్ణయించుకోండి” అని ధనుష్ అన్నాడు. తమిళ సినిమాలో నెగెటివిటీకి బదులుగా ఆరోగ్యకరమైన వాతావరణం అవసరమని ధనుష్ ఈ కార్యక్రమంలో ఎత్తి చూపారు.
“ప్రతి ఒక్కరి సినిమాలు బాగా ఆడాలి. నిర్మాతలందరూ బాగా చేయాలి. ఈ పరిశ్రమలోనే కాదు దాని వెలుపల కూడా దానిపై ఆధారపడిన చాలా మంది ఉన్నారు. దానిపై ఆధారపడిన వ్యాపారాలు చాలా ఉన్నాయి. అన్ని సినిమాలు విజయవంతంగా నడవడం చాలా ముఖ్యం. ఇది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి, దయచేసి సరైన సమీక్షలను చూడండి. చూసి సినిమా ఎలా ఉందో నిర్ణయించండి. ఇది నా అభ్యర్థన” అని ధనుష్ రిక్వెస్ట్ చేశాడు.
ఆరోగ్యకరమైన సినిమా వాతావరణం అవసరం
ఇడ్లీ కడై చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. అతను దీనికి దర్శకత్వం వహించాడు. అలాగే డాన్ పిక్చర్స్ తో కలిసి వండర్ బార్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో సహ నిర్మాతగానూ వ్యవహరించాడు. అరుణ్ విజయ్, షాలిని పాండే, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఇది ఇడ్లీ కొట్టు టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది.
ధనుష్ చేసిన హెచ్చరికతో అభిమానులు జాగ్రత్తగా ఉండాలి. సినిమా చూసి మీరే నిర్ణయించుకోండి. ఇడ్లీ కడై/ఇడ్లీ కొట్టు సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.


