
ఓ అభిమాని తనకు రాసిచ్చిన కోట్ల రూపాయల ఆస్తిని బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఏం చేశారో తెలుసా? ఆ విషయం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.
Key Points
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్కు అభిమాని రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చారు.
సంజయ్ దత్ ఆ ఆస్తిని అభిమాని కుటుంబానికి తిరిగి ఇచ్చారు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సంజయ్ దత్ యొక్క మానవతా దృక్పథాన్ని అభిమానులు కొనియాడుతున్నారు.
అభిమాని ప్రేమకు సంజయ్ దత్ స్పందన
ఓ హీరోను అభిమానించడం వేరు. కానీ అలాంటి హీరోకి తన మొత్తం ఆస్తిని రాసివ్వడం ఎప్పుడైనా విన్నారా? కానీ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఎప్పుడూ ఒక సినిమా స్క్రిప్ట్లానే ఉంటుంది. ఓ సినిమా కథను తలపించేలా, ఒక అభిమాని ఏకంగా రూ.72 కోట్ల ఆస్తిని తనకు రాసిచ్చిన విషయాన్ని ఈ నటుడు వెల్లడించాడు. ఆసక్తికరమైన మలుపు ఏంటంటే, ఆ మొత్తాన్ని అతడు తిరిగి ఆ అభిమాని కుటుంబానికి ఇచ్చేశాడు.
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ మధ్య ‘కర్లీ టేల్స్’తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 2018లో నిషా పాటిల్ అనే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక అభిమాని తన ఆస్తి మొత్తాన్ని సంజయ్ దత్కు రాసిచ్చిన సంఘటన గురించి ఇందులో అతన్ని అడిగారు. దీనిపై సంజయ్ సింపుల్ గా స్పందిస్తూ.. “నేను దానిని ఆమె కుటుంబానికి తిరిగి ఇచ్చేశాను” అని చెప్పడం గమనార్హం.
రూ.72 కోట్ల ఆస్తి దానం
62 ఏళ్ల ముంబైకి చెందిన ఆ గృహిణి, తన మరణం తర్వాత తన సంపదను దత్కు బదిలీ చేయాలని తన బ్యాంకుకు సూచించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది కాస్తా వైరల్ అయింది. అంత పెద్ద మొత్తాన్ని ఓ హీరోకి అభిమాని ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అయితే ఆ మొత్తాన్ని ఇప్పుడు ఆమె కుటుంబానికి అతడు తిరిగి ఇవ్వడాన్ని కూడా అభిమానులు కొనియాడుతున్నారు.
సంజయ్ దత్ కెరీర్ 1981లో ‘రాకీ’ సినిమాతో మొదలైంది. ఇది ఒక రోలర్ కోస్టర్ ప్రయాణం లాంటిది. ‘నామ్’, ‘సాజన్’, ‘ఖల్ నాయక్’, ‘వాస్తవ్’ వంటి ఐకానిక్ సినిమాల నుండి ఎంతో మందికి ఇష్టమైన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ వరకు సంజయ్ అపారమైన స్టార్డమ్, వ్యక్తిగత ఎదురుదెబ్బలు రెండింటినీ చూశాడు. 1993 బొంబాయి బాంబు పేలుళ్ల తర్వాత వచ్చిన న్యాయపరమైన చిక్కుల వల్ల అతడు ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించాడు. ఈ శిక్ష 2016లో పూర్తయింది.
సోషల్ మీడియాలో వైరల్
సంజయ్ ఈ ఏడాది ఇప్పటికే ‘భూత్నీ’, ‘హౌస్ఫుల్ 5’ సినిమాలలో చివరిసారిగా కనిపించాడు. ఇక ఇప్పుడు బాలకృష్ణతో కలిసి నటించిన తెలుగు మూవీ ‘అఖండ 2’ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అలాగే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై-యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్’ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రణ్వీర్ సింగ్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ‘ధురందర్’ విడుదల, ప్రభాస్, సంజయ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజాసాబ్’తో ఢీకొననుంది.
సంజయ్ దత్ యొక్క ఈ మానవతా చర్య అందరినీ ఆకర్షించింది. అతని ప్రవర్తన అభిమానులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సంఘటన సినీ ప్రపంచంలో మంచి అభిప్రాయాన్ని పొందింది.


