
కోలీవుడ్ నటుడు శింబు నటించిన ‘అరసన్’ (తెలుగులో ‘సామ్రాజ్యం’) చిత్ర ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శింబు “నా కథను ఎన్టీఆర్తో చేయించండి” అని చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
Key Points
శింబు, వెట్రిమారన్ కాంబోలో ‘అరసన్’ (తెలుగులో ‘సామ్రాజ్యం’) చిత్రం.
జూనియర్ ఎన్టీఆర్ ‘సామ్రాజ్యం’ తెలుగు ప్రోమోను విడుదల చేశారు.
“నా కథను ఎన్టీఆర్తో చేయించండి” అనే డైలాగ్ వైరల్గా మారింది.
ధనుష్ అతిథి పాత్ర, అనిరుధ్ సంగీతం ఈ సినిమా ప్రత్యేకతలు.
‘అరసన్’ (సామ్రాజ్యం) చిత్ర విశేషాలు
కోలీవుడ్ నటుడు శింబు (Silambarasan TR), దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan). తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) పేరుతో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు వర్షన్ ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ (NTR) విడుదల చేశారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు చెప్పారు.
ప్రోమో పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఏకంగా 5 నిమిషాలకు పైగానే ఉంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన వడ చెన్నై యూనివర్స్లో భాగంగానే సామ్రాజ్యం చిత్రం తీస్తున్నారు. ఇందులో ధనుష్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ప్రోమోలో మీడియా ప్రతినిధులు తన కథ గురించి చెప్పాలని శింబును అడుగుతారు. దానికి అతను “నా కథను ఎవరితో చేయిద్దామనుకుంటున్నారు.. ఎన్టీఆర్తో చేయించండి కుమ్మేస్తాడు” అనే డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు సోషల్మీడియాలో అది ట్రెండ్ అవుతుంది.
ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రోమో విడుదల
శింబు డైలాగ్: ట్రెండింగ్ ఎందుకు?
శింబు డైలాగ్ తో ‘సామ్రాజ్యం’ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ అభిమానులలో ఈ డైలాగ్ మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


