
📌 Key Points
- రోహిణికి షాక్ ఇచ్చిన సుగుణ, చింటు దత్తత విషయంలో కీలక నిర్ణయం!
- మనోజ్ని మరోసారి బురిడీ కొట్టించిన రోహిణి, పక్కా ప్లాన్ తో స్కెచ్!
- బాలు, మీనాలకి చింటు దత్తత ఇవ్వడానికి సుగుణ సముఖం, భారీ ట్విస్ట్!
- విద్యకు ఫోన్ చేసి అబద్ధాలు చెప్పిన రోహిణి, మనోజ్ అనుమానం నిజమేనా?
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సుగుణ తీసుకున్న నిర్ణయం రోహిణికి షాక్ ఇచ్చింది. మనోజ్ మరోసారి మోసపోయాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చూడాల్సిందే.
సుగుణ సంచలన నిర్ణయం!
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ లో రోహిణికి సుగుణ ఎదురు తిరగడం హైలైట్ గా చెప్పొచ్చు. చింటుపై హక్కు తనకే ఉంటుందని.. బాలు, మీనాకు దత్తతకు ఇస్తానని చెబుతుంది. ఇటు రోహిణి చేతుల్లో మనోజ్ మరోసారి మోసపోతాడు.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 611వ ఎపిసోడ్ లో రోహిణి మరోసారి తన మాటలతో మనోజ్ ను బురిడీ కొట్టిస్తుంది. అతడు మళ్లీ మోసపోతాడు. అటు చింటు కోసం మరోసారి సుగుణ దగ్గరికి వెళ్తారు బాలు, మీనా. దీంతో కన్న కూతురినే సుగుణ ఎదురిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
రోడ్డుపై బాలు, మీనా గొడవ.. పోలీస్ ఫైన్
ఇటు హాస్పిటల్లో తల్లి సుగుణకు రోహిణి సేవలు చేస్తుంటుంది. అప్పుడే సిస్టర్ అక్కడికి రావడంతో తల్లి బాగోగులు చూసుకోవడానికి ఎవరైనా కావాలని చెబుతుంది. తానే చూసుకుంటానని అనడంతో ఆమె సంతోషపడుతుంది.
మనోజ్ను మోసం చేసిన రోహిణి!
రోహిణికి మనోజ్ ఫోన్.. అబద్ధం చెప్పి..
మనోజ్ అనుమానంగా అడగడంతో వెంటనే విద్యకు రోహిణి ఫోన్ చేసి షాపు వైపుకు వెళ్లొద్దని అంటుంది. తాను అప్పటికే వచ్చాననడంతో వెంటనే వెళ్లిపొమ్మని చెబుతుంది. మనోజ్ వెళ్లి విద్యతో మాట్లాడుతుండగానే ఆమె వెళ్లిపోవడంతో అతనిలో అనుమానం మరింత ఎక్కువవుతుంది.
నిలదీసిన మనోజ్.. బురిడీ కొట్టించిన రోహిణి
చింటు దత్తతలో ట్విస్ట్!
నీ కోసమే పక్క ఊరిలో స్వామీజీ దగ్గరికి వెళ్లాను.. మంత్రించిన మాల తీసుకొచ్చానని చెబుతుంది. నమ్మడం లేదా అయితే అతనితోనే మాట్లాడు అంటూ విద్యకు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుంది. అవసరం లేదులే అంటూ మనోజ్ కరిగిపోతాడు. ఆమె తెచ్చిన మాల దేవుడి దగ్గర పెట్టి ఉదయమే వేసుకుంటానని వెళ్లడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది.
రవి పల్లీ పట్టీ.. ప్రభావతి కోసం మళ్లీ మీనాతో గొడవ
బాలు, మీనా సుగుణ దగ్గరికి వెళ్తారు. చింటు దత్తత విషయం ఆమెకు చెబుతారు. దీంతో ఆమె సంతోషిస్తుంది. రోహిణికి ఫోన్ చేసి ఆ విషయం చెబితే ఆమె తిడుతుంది. చింటును తానే పెంచానని, అతనిపై తనకే హక్కు ఉంటుందని, తాను బాలు, మీనాలకు దత్తత ఇస్తానని తేల్చి చెబుతుంది. దీంతో రోహిణి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రానున్న ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


