
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. కానీ, ప్రీ-రిలీజ్ ఈవెంట్ విషయంలో ఊహించని ట్విస్ట్ తో అభిమానులు షాక్ అవుతున్నారు. ఈవెంట్ వేదిక, అతిథులు మారడంతో చర్చ జరుగుతోంది.
Key Points
హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖలో కాకుండా హైదరాబాద్లో జరుగుతోంది.
ఈవెంట్కు హాజరయ్యే అతిథుల సంఖ్యను పరిమితం చేస్తున్నారు.
ముందుగా ప్రచారం చేసినట్లుగా రాజమౌళి ఈవెంట్కు రావడం లేదు.
పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ మాత్రమే ఈవెంట్కు హాజరుకానున్నారు.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) తాజాగా నటించిన మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ ఎన్నికలు ఆ తర్వాత జనసేన పార్టీ అధికారంలోకి రావడం… ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో… హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
అతిథుల సంఖ్య పరిమితి
అయితే ఇప్పుడు ఈ సినిమా.. రిలీజ్ కు సిద్ధమైంది. ఈనెల 24వ తేదీన థియేటర్లలో హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే నాలుగు రోజులు ముందు అంటే 20వ తేదీన.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. విశాఖలో ప్రీ రిలీజ్ నిర్వహించాలని.. ముందే ప్లాన్ చేశారట. అయితే ఈ ఈవెంట్ విషయంలో… అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. విశాఖలో కాకుండా హైదరాబాద్ లోని ప్రైవేట్ హోటల్లో… హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.
రాజమౌళి హాజరు కాకపోవడం
ఎక్కువ మంది గెస్టులు లేకుండా… లిమిటెడ్ గా నిర్వహించాలని ఇప్పుడు నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లుగా రాజమౌళి వస్తారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన కూడా రావడం లేదట. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మాత్రమే ఈ ఈవెంట్ కు వెళ్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో… అభిమానులు షాక్ అవుతున్నారు.
హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ విషయంలో వచ్చిన మార్పులు అభిమానులను నిరాశపరిచాయి. చివరి నిమిషంలో వచ్చిన ఈ మార్పులు సినిమాపై ఆసక్తిని పెంచాయి.


