
📌 Key Points
- ఐఆర్సీటీసీ తెలుగువారి కోసం 4 ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీలను అందిస్తోంది.
- ఏప్రిల్ 14 నుండి జూన్ 12 మధ్య సికింద్రాబాద్ నుండి ఈ రైళ్లు నడుస్తాయి.
- అయోధ్య, కాశీ, మాతా వైష్ణో దేవి, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలను ఈ ప్యాకేజీలు కవర్ చేస్తాయి.
- టికెట్ ధరలు రూ.14,500 నుండి రూ.34,100 వరకు ఉంటాయి, ప్రయాణ తరగతిని బట్టి ధర మారుతుంది.
ఐఆర్సీటీసీ తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలు దేశంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి వీలు కల్పిస్తాయి. తక్కువ ధరలో ఈ టూర్ ప్యాకేజీలను పొందవచ్చు.
ఐఆర్సీటీసీ అందిస్తున్న ప్రత్యేక ప్యాకేజీలు
బడ్జెట్ ధరలో ఐఆర్సీటీసీ పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మధ్యతరగతివారు కూడా ఈ ప్యాకేజీల్లో టూర్లు తిరిగిరావొచ్చు. దేశంలో ముఖ్యమైన ప్రదేశాలకు ఈ టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే తీర్థయాత్ర పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం నాలుగు ప్రత్యేక ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ప్యాకేజీలను ప్రకటించింది.
ఈ రైళ్లు ఏప్రిల్ 14 నుండి జూన్ 12 మధ్య సికింద్రాబాద్ నుండి నడవనున్నాయి. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడిస్తూ.. జాయింట్ జనరల్ మేనేజర్ (టూరిజం) డి.ఎస్.జీ.పీ.కిషోర్ మాట్లాడారు. భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులకు ఒక సమగ్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
మొదటి ప్యాకేజీ అయిన అయోధ్య–కాశీ: బైద్యనాథ్ ధామ్ దర్శన యాత్ర(SCZBG56) ఏప్రిల్ 28 నుండి మే 7 వరకు కొనసాగుతుంది. ఇది పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ క్షేత్రాలను కవర్ చేస్తుంది.
ప్యాకేజీ వివరాలు, ధరలు
దీని తర్వాత మే 12 నుండి మే 21 వరకు ‘హరిద్వార్–మాతా వైష్ణో దేవి–ఋషికేశ్ యాత్ర’ (SCZBG57) ఉంటుంది. ఇది మధుర, బృందావనం, వైష్ణో దేవి, హరిద్వార్, ఋషికేశ్ క్షేత్రాలను కనెక్ట్ చేస్తుంది.
మూడో ప్యాకేజీ అయిన ‘అరుణాచలం–చిదంబరం దివ్య దక్షిణ యాత్ర’ (SCZBG58), మే 24 నుండి మే 31 వరకు షెడ్యూల్ చేశారు. ఇది రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తంజావూరు వంటి కీలకమైన దక్షిణ భారత తీర్థయాత్ర కేంద్రాలను కవర్ చేస్తుంది.
నాలుగో ప్యాకేజీ అయిన స్పెషల్ ‘ అయోధ్య –కాశీ యాత్ర’ (SCZBG59), యమునా పుష్కరాల సందర్భానికి అనుగుణంగా జూన్ 3 నుండి జూన్ 12 వరకు నడుస్తుంది.
ప్రయాణ వివరాలు, సౌకర్యాలు
ప్రయాణ తరగతిని బట్టి టికెట్ ధరలు రూ.14,500 నుండి రూ.34,100 మధ్య ఉంటాయి. ఈ ప్యాకేజీలలో రైలు, రోడ్డు రవాణా, వసతి, భోజనం, గైడ్ సహాయంతో సందర్శనలు, బీమా సదుపాయాలు కూడా కలిసి ఉండనున్నాయి. రైలులో భద్రతా సిబ్బంది, సీసీటీవీ నిఘా ఏర్పాట్లు కూడా కల్పించారు.
పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ అధికారిక వెబ్సైట్ వెళ్లొచ్చు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్రత్యేక ప్యాకేజీలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆధ్యాత్మిక యాత్రలను మరింత అందుబాటులోకి తెస్తాయి. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం.


