
జబర్దస్త్ కామెడీ షో తెలుగు టెలివిజన్లో ఒక ట్రెండ్ సెట్టర్. అయితే గత కొన్ని రోజులుగా ఈ షో తన పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. టీఆర్పీలు కూడా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రోమోలో టీమ్ లీడర్లు అయిన ధన్ రాజ్, బుల్లెట్ భాస్కర్ వంటి వారు షో నుంచి వెళ్లిపోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇది ప్రేక్షకులకు పెద్ద షాక్.
Key Points
జబర్దస్త్ దాదాపు 12 ఏళ్లుగా తెలుగు టెలివిజన్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది.
గత రెండు మూడేళ్లుగా షో కళ కోల్పోయి, కామెడీ తగ్గడంతో టీఆర్పీలు పడిపోయాయి.
కొత్త ప్రోమోలో పాత టీమ్ లీడర్లు అందరూ కలసి సంచలన ప్రకటన చేశారు.
ధన్ రాజ్, బుల్లెట్ భాస్కర్ వంటి వారు షో నుండి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు.
జబర్దస్త్ షోకి పూర్వవైభవం దూరం?
జబర్దస్త్ కామెడీ షో తెలుగు టెలివిజన్ లో ఒక ట్రెండ్ సెట్టర్. ఈ షో దాదాపు 12ఏళ్లుగా ఇంటిళ్లిపాదిని అలరిస్తూ వస్తోంది. నవ్వులు పూయిస్తోంది. కామన్ ఆడియెన్స్ నుంచి బిగ్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్ వరకు ఈ షో చూడని వారు లేరని చెబితే అతిశయోక్తి కాదు. ప్రారంభంలో ఈ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్లే ఎక్కువగా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. అయినా విశేష ఆదరణ పొందింది. నవ్వులు పంచడంలో సక్సెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ కామెడీ షోగా నిలిచింది. అదే సమయంలో ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్ లు కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు, కొందరు స్టార్స్ అయ్యారు. సినిమాల్లో అవకాశాలను పొందారు. ఇప్పుడు చాలా మంది రాణిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత రెండు మూడేళ్లుగా జబర్దస్త్ షోకి కళ పోయింది. కామెడీ తగ్గింది. గతంలో మాదిరిగా నవ్వించలేకపోతున్నారు కమెడియన్లు. కామెడీ రొటీన్ అయిపోయింది. దీంతో ఆ కిక్ రావడం లేదు. ఇది టీఆర్పీ రేటింగ్ని కూడా తగ్గించింది. ఈ షోని ఇప్పుడు చూసేవాళ్లు తగ్గిపోయాయి. ఇతర ఎంటర్టైన్మెంట్స్ షోస్ పెరిగిపోవడంతో దీనికి ఆదరణ దగ్గుతుంది. ఈ క్రమంలో ఈ షోకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. మాజీ కామెడియన్లని దించారు. గతంలో టీమ్ లీడ్గా చేసి సినిమాల్లోకి వెళ్లిపోయిన కొందరిని మరోసారి షోకి తీసుకొచ్చారు. వారిచేత స్కిట్లు చేయించారు. తాజాగా వాటికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వచ్చింది. ఇది ఆకట్టుకుంటోంది. అదే సమయంలో పెద్ద షాకిస్తుంది.
టీమ్ లీడర్ల సంచలన నిర్ణయం!
ఇందులో టీమ్ లీడర్లు అందరు కలిసి ఒక స్కిట్ చేశారు. అదే సమయంలో లేడీ కమెడియన్లు అంతా కలిసి ఒక స్కిట్, లేడీ గెటప్ కమెడియన్లు మరో స్కిట్, చిన్న పిల్లలు కలిసి ఒక స్కిట్, పెద్ద వాళ్లు మరో స్కిట్ చేశారు. ఎవరికి వారు తమ స్కిట్లతో రెచ్చిపోయారు. ఆద్యంతం నవ్వులు పూయించారు. అయితే ప్రారంభంలోనే బుల్లెట్ భాస్కర్ చెబుతూ, మేం ప్రదర్శించే స్కిట్ పదికి పది రాకపోతే స్వచ్ఛందంగా వెళ్లిపోతామని తెలిపారు. అనంతరం స్కిట్లు ప్రదర్శించారు. ఎవరికి వారు రెచ్చిపోయారు.
షో భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం
స్కిట్లు అన్ని అయిపోయాక చివరగా టీమ్ లీడర్లు బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, ధన్ రాజ్, ఆటో రామ్ ప్రసాద్ స్టేజ్పైకి వచ్చి పెద్ద షాక్ ఇచ్చారు. అందరికి నమస్కారం. మేమందరం జబర్దస్త్ షోని వదిలేద్దామనుకుంటున్నాం అని ధన్ రాజ్ వెల్లడించారు. కొత్తవాళ్లు వస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగానే వాళ్లని కూడా ఎంకరేజ్ చేయండి అని ఆటోరామ్ ప్రసాద్ తెలిపారు. ఎవరు ఏ స్కిట్ చేసినా మాపై చూపించిన ప్రేమని వాళ్లపై కూడా చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్యూ సో మచ్ అని తెలిపారు చలాకీ చంటి. దీంతో షోలో ఉన్న వాళ్లంతా షాక్ అవుతున్నారు. అటు జడ్జ్ లు కృష్ణభగవాన్, ఇంద్రజ, యాంకర్ రష్మి, మిగిలిన కమెడియన్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే నిజంగానే వీళ్లు షోని వదిలేస్తున్నారా? లేక స్కిట్లో భాగంగా ఆడే గేమా అనేది తెలియాల్సి ఉంది. అయితే జబర్దస్త్ లో ఇలాంటివి రెగ్యూలర్గా జరుగుతూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదేనా అనేది తెలియాల్సి ఉంది. ఈ జబర్దస్త్ షో శుక్రవారం, శనివారం ఈటీవీలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
జబర్దస్త్ షోకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సమయంలో టీమ్ లీడర్లు షోను వదిలి వెళ్లడం పెద్ద షాక్. ఇది షో భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రేక్షకులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.


