
📌 Key Points
- దాసు ప్లాన్ తో పారిజాతానికి మైండ్ బ్లాక్ షాక్!
- సుమిత్ర ఆపరేషన్ సక్సెస్! ఊహించని ట్విస్ట్.
- థియేటర్లో దీపను చూసిన జ్యోత్స్న – షాకింగ్ సీన్!
- కార్తీక్ స్ట్రాటజీతో పారిజాతం ఉక్కిరిబిక్కిరి!
కార్తీక దీపం 2 సీరియల్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పారిజాతానికి దాసు షాకింగ్ ట్రీట్మెంట్ ఇవ్వగా, జ్యోత్స్న థియేటర్లో దీపను చూడటం సంచలనంగా మారింది. ఏం జరగబోతుందో చూడాలి!
దాసు ప్లాన్: పారిజాతానికి షాక్ ట్రీట్మెంట్!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో కీలకమైన మలుపు చోటు చేసుకుంటుంది. పారిజాతాన్ని బయటకు రప్పించడం కోసం దాసు అబద్దం చెప్తాడు. సుమిత్రకు ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఆపరేషన్ థియేటర్లో దీపను జ్యోత్స్న చూస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో.. నేను అన్ని ప్లాన్ చేశానని టెన్షన్ పడుతున్నడాక్టర్ కు కార్తీక్ చెప్తాడు. అప్పుడే పారిజాతానికి దాసు ఫోన్ చేస్తాడు. నువ్వు దూరం చేసిన నీ మనవరాలు దొరికిందమ్మా అని పారుకు దాసు అబద్దం చెప్తాడు. హాస్పిటల్ బయటే ఉన్నా అమ్మ అని దాసు చెప్పగానే, పారు వెళ్లిపోతుంది.
ఆపరేషన్ సక్సెస్: దీపను చూసిన జ్యోత్స్న!
దాసు ఫోన్ చేశాడని, తాగడానికి వాటర్ ఇచ్చాడని పారు చెప్తుంది. నేను ఎందుకు ఫోన్ చేశాను? నేను వాటర్ ఇవ్వడం ఏంటీ? అని దాసు ట్విస్ట్ ఇస్తాడు. నీకేదో మతి భ్రమించిందని శివ నారాయణ అంటాడు. పారును కార్తీక్ మరింత కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆపరేషన్ ఎప్పుడో అయిపోయిందని కార్తీక్ చెప్తాడు.
కార్తీక్ స్ట్రాటజీ: పారిజాతం ఉక్కిరిబిక్కిరి!
నన్ను గిచ్చు అని కార్తీక్ ను పారిజాతం అడుగుతుంది. కార్తీక్ గట్టిగా గిల్లుతాడు. ఈ మనిషి ఇక్కడ ఉందో లేదో అని కన్ఫామ్ చేసుకుంటున్నానని పారిజాతం మళ్లీ నోరు జారుతుంది. చేసిన తప్పులు, పాపాలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు గజగజ వణుకుతున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే.. వెంటనే లగేజీ సర్దేయండని కార్తీక్ చెప్తాడు. పారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ లో రోజుకో ట్విస్ట్ ఎదురుచూస్తూనే ఉంది. పారిజాతానికి షాక్ మీద షాక్ తగులుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


