
నటి కాయదు లోహార్ కెరీర్ ప్రస్తుతం దూసుకుపోతోంది. తమిళంలో ‘డ్రాగన్’ హిట్ తర్వాత ఆమెకు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరసగా అవకాశాలు వస్తున్నాయి. విశ్వక్ సేన్ ‘ఫంకీ’తో పాటు విశాల్ సరసన పెద్ద ప్రాజెక్ట్లో నటించనుంది. ఆమె కెరీర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
Key Points
కన్నడ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి, 'అల్లూరి' తర్వాత తమిళంలో 'డ్రాగన్'తో బ్రేక్.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ.
తెలుగులో విశ్వక్ సేన్ 'ఫంకీ'లో, తమిళంలో విశాల్ సినిమాలో హీరోయిన్గా ఎంపిక.
దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో కాయదుకి ప్రాధాన్యత ఉన్న పాత్ర.
కాయదు కెరీర్కు ‘డ్రాగన్’ బ్రేక్
హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది. అదృష్టం కలిసొచ్చి ఆ మూవీ హిట్ అయితే తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయి. కాయదు లోహార్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2021లో కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ ‘అల్లూరి’ అనే మూవీ చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతేడాది తమిళంలో వచ్చిన ‘డ్రాగన్’.. ఈమె కెరీర్ని మలుపు తిప్పేసింది. దీంతో ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
తెలుగు, తమిళంలో బిజీగా కాయదు
తమిళంలో ఇదయం మురళి అనే సినిమా చేయగా.. ఇది విడుదలకు సిద్ధమైంది. తెలుగులోనూ విశ్వక్ సేన్ ‘ఫంకీ’లో ఈమెనే హీరోయిన్. ఇప్పుడు తమిళంలో విశాల్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో ఈ ఏడాది ‘మదగజరాజా’ వచ్చింది. హిట్ అయింది. దీంతో ఇప్పుడు రిపీట్ కాబోతున్న కాంబోలోకి కాయదు వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఒకరికి మించి హీరోయిన్లు ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. త్వరలో విశాల్ హీరోగా తీయబోయే సినిమాలో ఇద్దరు బ్యూటీస్కి చోటు ఉంది. అందులో ఒక హీరోయిన్గా కాయదు లోహర్ని ఎంపిక చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విశాల్తో మరో అవకాశం
మొత్తంగా, కాయదు లోహార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో పెద్ద స్టార్స్ సరసన నటిస్తూ తన కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకుపోతోంది. ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నాం.


