
టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన ‘కిష్కిందపురి’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సినిమా నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, సెట్ నిర్మాణం, కార్మికుల సమ్మె ప్రభావం గురించి వివరించారు.
Key Points
రూ.2 కోట్లతో భారీ సెట్ నిర్మాణం
కార్మికుల సమ్మె ప్రభావం
కిష్కిందపురి సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 12
నవంబర్ 15 న షూటింగ్ పూర్తి
భారీ సెట్ నిర్మాణం
టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కిష్కిందపురి సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు.
కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన కిష్కిందపురి మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా విలేకరుల సమావేశంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్ సాహు గారపాటి. కార్మికుల సమ్మె గురించి కూడా చెప్పుకొచ్చారు.
-మా డైరెక్టర్ గారు ముందు అజినిష్తో ట్రావెల్ అయ్యారు. అయితే ఆయన షెడ్యూల్ కుదరకపోవంతో సాంగ్స్ని చైతన్ భరత్తో చేయించాం. రీ రికార్డింగ్ కోసం ఒకటి రెండు రీల్స్ ఇచ్చాం. తను చేసింది అద్భుతంగా ఉంది. ఇక తననే కంటిన్యూ చేశాం.
కార్మికుల సమ్మె ప్రభావం
-మేము పెద్ద సినిమాలే చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు బడ్జెట్ లో అవుతాయని తెలిస్తేనే చేయడం ఎవరికైనా మంచిది.
-దాదాపు రూ. 2 కోట్లతో సెట్ వేయడం జరిగింది. ఆ సెట్ వెయ్యడానికే నెల రోజులు సమయం పట్టింది.
-15 రోజుల షూటింగ్ ఎఫెక్ట్ అయింది. అయితే ఆర్టిస్టులందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కొత్త షెడ్యూల్ మొదలైపోయింది. నవంబర్ 15కి సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుంది. సంక్రాంతికి సినిమా వచ్చేస్తుంది.
సినిమా విడుదల వివరాలు
-బిజినెస్ విషయంలో మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాము.
-కౌశిక్ చాలా మంచి నెరేటర్. కథని చాలా అద్భుతంగా చెబుతాడు. చాలా మంచి మేకర్. మోడ్రన్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్తో సినిమాని తీశారు.
– కిష్కిందపురి అనే ఒక ఊరిలో జరిగే కథ ఇది. అందుకే ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టడం జరిగింది.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, కార్మికుల సమ్మె వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ, సినిమా షూటింగ్ త్వరలో పూర్తవుతుందని, సెప్టెంబర్ 12న విడుదల అవుతుందని తెలిపారు.


