|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కెఫే నుంచి కోహ్లి, అనుష్కలను వెళ్లగొట్టిన స్టాఫ్.. కారణమేంటో తెలిస్తే షాకవుతారు

Published: 11-09-2025, 7:11 AM
కెఫే నుంచి కోహ్లి, అనుష్కలను వెళ్లగొట్టిన స్టాఫ్.. కారణమేంటో తెలిస్తే షాకవుతారు

ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి మరియు నటి అనుష్క శర్మలు న్యూజిలాండ్‌లోని ఓ కెఫే నుండి వెళ్లగొట్టబడ్డారు. ఈ సంఘటన వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.

Key Points

1

న్యూజిలాండ్ కెఫేలో కోహ్లి, అనుష్కను బయటకు పంపించారు.

2

జెమీమా రోడ్రిగ్స్‌తో నాలుగు గంటల పాటు చర్చించడం కారణం.

4

స్టాఫ్ సమయం పరిమితి కారణంగా బయటకు పంపారు.

కెఫే ఘటన వివరాలు

సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చాలా వరకు పబ్లిక్ కు దూరంగానే ఉంటారు. కానీ ఇప్పుడీ జంట ఓ విచిత్రమైన ఘటన ద్వారా వార్తల్లో నిలుస్తోంది. న్యూజిలాండ్ లోని ఓ కెఫే నుంచి ఈ జంటను బయటకు పంపించారట. అంతటి సెలబ్రిటీలకు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అయితే దీని వెనుక ఓ బలమైన కారణమే ఉందని చెబుతోంది ఇండియన్ వుమెన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.

ఇండియన్ వుమెన్ క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్‌తో కోహ్లి , అనుష్కలు గంటల తరబడి మాట్లాడటే దీనికి కారణమట. నాలుగు గంటలకుపైగా వాళ్ల మీటింగ్ సాగడంతో ఇక ఉండబట్టలేక అక్కడి స్టాఫ్ వాళ్లను బయటకు పంపించినట్లు జెమీమా తెలిపింది. రీసెంట్‌గా రోడ్రిగ్స్.. మాషబుల్ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లోని ‘ది బాంబే జర్నీ’ లేటెస్ట్ ఎపిసోడ్‌లో కనిపించింది. అందులో ఆమె విరాట్, అనుష్కతో జరిగిన ఈ ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకుంది.

జెమీమా రోడ్రిగ్స్ వివరణ

రోడ్రిగ్స్ చెప్పినదాని ప్రకారం.. విరాట్, అనుష్క , స్మృతి మంధాన తో తన సంభాషణ నాలుగు గంటలకు పైగా సాగింది. దీనివల్ల న్యూజిలాండ్‌లోని కెఫే స్టాఫ్ వాళ్ళను బయటకు వెళ్లమని అడిగారు. విరాట్ అనుమతి తీసుకున్న తర్వాతే వాళ్ళిద్దరూ మాట్లాడటం మొదలుపెట్టారని జెమీమా చెప్పింది. వాళ్ళు అతనితో బ్యాటింగ్ గురించి మాట్లాడారు. తర్వాత మెన్స్, వుమెన్స్ టీమ్స్ ఉంటున్న హోటల్‌లోని ఒక కెఫేకి అతన్ని ఇన్వైట్ చేశారు.

“అనుష్క కూడా అక్కడ ఉంది. మొదటి అరగంట క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం. అతను స్మృతి ఇంకా నాతో మాట్లాడుతూ.. ‘మీ ఇద్దరికీ మహిళల క్రికెట్‌ను మార్చే శక్తి ఉంది. అది జరగడం నేను చూడగలను’ అని చెప్పారు. తర్వాత మేము జీవితం గురించి మాట్లాడుకున్నాం. చాలా రోజుల తర్వాత కలుసుకున్న స్నేహితులు మాట్లాడుకున్నట్లు అనిపించింది. కెఫే స్టాఫ్ మమ్మల్ని బయటకు పంపినందువల్లే మేము మాట్లాడటం ఆపాము” అని రోడ్రిగ్స్ చెప్పింది. తమ సంభాషణ నాలుగు గంటలకు పైగా సాగిందని కూడా ఆమె తెలిపింది.

కోహ్లి, అనుష్క జంట జీవితం

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి 2013లో ఒక యాడ్ షూటింగ్ లో కలిసినప్పుడు వాళ్ళ డేటింగ్ మొదలైంది. దాదాపు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట 2017 డిసెంబర్‌లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అనుష్క వాళ్ళ మొదటి బిడ్డ వామికకు 2021 జనవరిలో జన్మనిచ్చింది. 2024 ఫిబ్రవరి 15న వాళ్ళిద్దరూ కొడుకు అకాయ్‌కి తల్లిదండ్రులు అయ్యారు.

2024 ఫిబ్రవరిలో వాళ్ళ రెండో బిడ్డ అకాయ్ పుట్టిన తర్వాత వాళ్ళు లండన్‌కు షిఫ్ట్ అయ్యారని అనుకుంటున్నారు. వాళ్ళు తమ వ్యక్తిగత జీవితం గురించి చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. వాళ్ళ పిల్లల విషయంలో ఇప్పటికీ నో ఫోటో పాలసీని ఫాలో అవుతారు.

చివరగా, కోహ్లి, అనుష్కల కెఫే అనుభవం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నాలుగు గంటల సంభాషణ కారణంగా వాళ్ళను బయటకు పంపించడం చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.