|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెంగాల్‌లో కుట్ర! ఓటు హక్కును లాక్కుంటున్న బీజేపీ, ఈసీ: మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు!

Published: 25-03-2026, 12:35 PM
బెంగాల్‌లో కుట్ర! ఓటు హక్కును లాక్కుంటున్న బీజేపీ, ఈసీ: మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు!
  • బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓటు హక్కును లాక్కుంటున్నారని మమతా బెనర్జీ ఆరోపణ.
  • ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మమతా బెనర్జీ విమర్శ.
  • కొన్ని వర్గాలను ఎన్నికల ప్రక్రియల నుంచి తొలగిస్తున్నారని ఆరోపణ.
  • ప్రజలే తన అతిపెద్ద బలమని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓటు హక్కును లాక్కుంటున్నాయని ఆమె ఆరోపించారు.

బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో పార్టీల మధ్య విమర్శలు ఊపందుకున్నాయి. బెంగాల్ సీఎం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ, కేంద్రం, ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. మైనగురిలో బుధవారం జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, ఎన్నికల సంఘం ‘ప్రజల ఓటు హక్కును లాక్కుంటున్నాయ’ని ఆరోపించారు. నేడు ఓటుహక్కును లాక్కున్న వారు రేపు ఎన్నార్సీని తెచ్చి, పౌరసత్వాన్ని కూడా లాక్కుంటారని ఆరోపించారు. సర్ పేరుతో కొన్ని వర్గాలను ఎన్నికల ప్రక్రియల నుంచి తొలగిస్తున్నారు. రాజబన్షీలతో పాటు మహిళల ఓటర్ల పేర్లను కూడా తీసేశారు. సర్ కారణంగా సంభవించే మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఎంసీకి అధికారాలు లేకుండా చేస్తున్నారని, తనకు అతిపెద్ద బలం రాష్ట్ర ప్రజలేనని చెప్పారు. తన వద్ద నుంచి అన్నీ లాగేసుకున్నారు. ఇప్పుడు నా చేతుల్లో ఉన్నది కేవలం ప్రజలేనని పేర్కొన్నారు.

ఓటు హక్కును లాక్కుంటున్నారని విమర్శ

ప్రజలే నాకు అండ: మమతా బెనర్జీ

మమతా బెనర్జీ చేసిన ఈ ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రానున్న ఎన్నికల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.