
తెలుగు సినీ నటుడు మంచు మనోజ్ తన కొత్త చిత్రం ‘భైరవం’ ప్రమోషన్స్ లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అర్జున్ రెడ్డి, రామ్ చరణ్ ‘రచ్చ’, నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలను చేయడానికి అవకాశం వచ్చిందని, కానీ వేరే కారణాల వల్ల చేయలేకపోయాడని తెలిపాడు.
Key Points
మంచు మనోజ్ 'భైరవం' సినిమాతో కం బ్యాక్.
అర్జున్ రెడ్డి, రచ్చ, ఆటోనగర్ సూర్య సినిమాలను మిస్ చేసుకున్నట్లు వెల్లడి.
డేట్స్ సమస్యల వల్ల సినిమాలు చేయలేకపోయాడని వివరణ.
నెటిజన్లు మనోజ్ వేరే ఛాయిస్ చేసుకుంటే ఎలా ఉండేదో చర్చిస్తున్నారు.
భైరవం సినిమా రిలీజ్
మంచు మనోజ్(Manchu Manoj) చాలా కాలం తర్వాత సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇందులో భాగంగా విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో ‘భైరవం’(Bairavam) సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీలో మనోజ్తో పాటు రోహిత్(Nara Rohith), బెల్లంకొండా సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) కూడా నటిస్తున్నారు. అయితే ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది.
అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి(Arjun Reddy), రామ్ చరణ్(Ram Charan) ‘రచ్చ’(Racha), నాగ చైతన్య(Naga Chaitanya) ‘ఆటో నగర్ సూర్య’(Autonagar Surya) లాంటి సినిమాలను మిస్ చేసుకున్నా అని తెలిపారు. అప్పట్లో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక, వేరే పరిస్థితుల కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయా అని చెప్పాడు మనోజ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. అర్జున్ రెడ్డి సినిమా మనోజ్ చేసి ఉంటే ఇప్పుడు మనోజ్ రేంజ్ మరో లెవల్ లో ఉండేది అని నెటిజన్స్ కామెట్స్ చేస్తున్నారు.
మిస్ అయిన సినిమా అవకాశాలు
నెటిజన్ల స్పందన
మంచు మనోజ్ మిస్ అయిన సినిమా అవకాశాల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అర్జున్ రెడ్డి, రచ్చ, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలు ఆయన కెరీర్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేవి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


