
📌 Key Points
- చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది, నెంబర్ వన్ ట్రెండింగ్!
- ఈ చిత్రం థియేటర్లలో దాదాపు రూ.290 కోట్ల వసూళ్లు రాబట్టింది, భారీ రికార్డు సృష్టించింది.
- సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ రూ.175-180 కోట్ల షేర్ సాధించింది.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో, నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది. అసలు ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ ఏమిటి?
ఓటీటీలో దుమ్మురేపుతున్న మెగా మూవీ!
చిరంజీవి హీరోగా నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` థియేటర్ రన్ ముగించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రీజనల్ ఫిల్మ్స్ లో ఇది రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ జోరు చూపిస్తోంది.
`మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. బుధవారం నుంచే ఓటీటీలోకి వచ్చింది. ప్రారంభంలో పెద్దగా ఆదరణ లేని ఈ మూవీ ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతుంది. జీ 5 లో టాప్ 10లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది. మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీరియల్గా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి పండగ కాబట్టి థియేటర్లో నడిచిపోయింది. కానీ ఓటీటీలో కష్టమంటున్నారు కొందరు నెటిజన్లు. ఇలాంటి విమర్శల మధ్య ఈ మూవీ జీ 5లో ట్రెండింగ్లో ఉండటం విశేషం.
థియేటర్లలో చిరంజీవి కలెక్షన్ల సునామీ!
ఇక చిరంజీవి మూవీ థియేట్రికల్గా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. మరి థియేటర్లలో ఈ మూవీకి ఫైనల్గా ఎన్ని కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే ఇప్పటి వరకు ఇది దాదాపుగా రూ.290కోట్లు రాబట్టినట్టు సమాచారం. రూ.175-180కోట్ల థియేట్రికల్ షేర్ని సాధించిందట. ఈ సినిమాకి థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.120కోట్లు అయ్యింది. దీంతో బ్రేక్ ఈవెన్ దాటుకుని ఏకంగా రూ.55-60 కోట్ల వరకు లాభాలను పొందింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లాభాలు రాబట్టిన మూవీ ఇదే అని చెప్పొచ్చు. గత సంక్రాంతికి వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` తర్వాత ఈ సినిమానే భారీ లాభాలను గడించిందని చెప్పొచ్చు.
విమర్శలు ఉన్నా నెంబర్ వన్ ట్రెండింగ్!
చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నయనతార హీరోయిన్గా నటించింది. వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ, ఫన్ కంటెంట్తో ఈ మూవీని రూపొందించారు అనిల్. మహిళా ప్రేక్షకులకు, చిరంజీవి అభిమానులకు, అలాగే చిన్నపిల్లల్ని అలరించేలా ఈ మూవీ ఉండటంతో అన్ని వర్గాల ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇది రీజినల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
చిరంజీవి సినిమా ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది, థియేటర్లలో భారీ వసూళ్లు సాధించింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


