
హైదరాబాద్ లోని నార్సింగిలో మరో కొత్త వినోద కేంద్రం మిరాజ్ సినిమాస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. నాలుగు డాల్బీ డిజిటల్ స్క్రీన్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ మాల్, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందిస్తుంది.
Key Points
నార్సింగిలో మిరాజ్ సినిమాస్ గ్రాండ్ గా ప్రారంభం.
నాలుగు అత్యాధునిక డాల్బీ డిజిటల్ స్క్రీన్లు.
801 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి సినీ అనుభవం.
గ్రౌండ్ ఫ్లోర్ లో డీమార్ట్ ఉన్న మాల్.
మిరాజ్ సినిమాస్ గ్రాండ్ ప్రారంభం
భాగ్యగరంలో కొత్తగా వినోదం పంచేందుకు మరో మాల్ ప్రారంభమైంది . తాజాగా నార్సింగి ప్రాంతంలో మిరాజ్ సినిమాస్, ఆనంద్ మాల్ అండ్ మూవీస్ ను ఇవాళ గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కొత్త మాల్ లో నాలుగు అత్యాధునిక డాల్బీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు, సినీ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి, రఘురామ్ గ్రూప్ ఎండీ డాక్టర్ అనందరావు, మిరాజ్ సినిమాస్ ఎండీ భువనేశ్ పాల్గొన్నారు .
అత్యాధునిక సదుపాయాలు
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు .’ హైదరాబాద్ నగరానికి సినిమాలే ఊపిరి. ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు దగ్గర్లో ప్రీమియం థియేటర్లు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా కుటుంబ అవసరాలు, వినోదం రెండింటినీ నార్సింగిలోని ఈ మిరాజ్ సినిమాస్ తీరుస్తుంది” అని అన్నారు . దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ ..’ వినోదం అంటే కేవలం సినిమా మాత్రమే కాదు. అన్ని ఆనందాలూ పంచుకోవడం. ఈ మల్టీప్లెక్స్ వల్ల అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ, కంఫర్ట్ రెండూ లభిస్తాయి. నార్సింగి ప్రాంత వాసులకు ఇది కచ్చితంగా నచ్చుతుందని విశ్వసిస్తున్నా” అని అ న్నారు .
నార్సింగి ప్రజలకు వినోదం
కాగా .. ఈ థియేటర్లలో 801 సీట్ల సామర్థ్యంతో ఉండనున్నాయి. మిరాజ్ సినిమాస్ ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి సినీ అనుభవాన్ని అందించనుంది. అంతేకాకుండా ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డీమార్ట్ ఉండనుంది. ఈ మాల్ ఓఆర్ఆర్కు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది.
మిరాజ్ సినిమాస్, నార్సింగి ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా అనుభవాన్ని అందిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ మాల్ ప్రజలకు వినోదంతో పాటు ఇతర అవసరాలను తీరుస్తుంది.


