
📌 Key Points
- మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండటం వలన అంతఃశుద్ధి జరుగుతుంది.
- ఈ రోజున నదీ స్నానం, దానధర్మాలు చేయడం శుభప్రదం.
- రావి చెట్టు నీడలో దీపాలను వెలిగిస్తే శుభం కలుగుతుంది.
- పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం వలన మంచి ఫలితాలు వస్తాయి.
మౌని అమావాస్య హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజున మౌనంగా ఉండటం, నదీ స్నానాలు చేయడం, దానధర్మాలు చేయడం వంటివి ఎంతో పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. దీని విశిష్టతను తెలుసుకుందాం.
మౌని అమావాస్య ప్రాముఖ్యత
ప్రతి అమావాస్యనాడు చాలామంది రకరకాల పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం.
అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి అమావాస్యనాడు చాలామంది రకరకాల పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం. అందుకే అమావాస్య నాడు చాలా మంది మౌన దీక్షను పాటిస్తారు. అలాగే ఈ మౌని అమావాస్య నాడు నదీ స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వంటివి ఎంతో శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తాయి.
ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 5:27 నుంచి ఉదయం 6:21 మధ్య స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య నాడు చంద్రుడు దర్శనం ఇవ్వడు. మౌని అమావాస్య నాడు కూడా చంద్రుడు దర్శనం ఉండదు కనుక ఆ అమావాస్య నాడు కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉండవు. మౌని అమావాస్యనాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
మౌని అమావాస్య నాడు వీటిని పాటించడం మంచిది
మౌని అమావాస్య రోజు చేయవలసినవి
నువ్వుల నూనెతో లేదా నువ్వులతో శనీశ్వరుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
మౌని అమావాస్య నాడు పూర్తిగా మౌనం పాటించడం మంచిదని అంటారు. అందుకే మౌని అమావాస్య నాడు అందరూ మౌనంగా ఉంటారు. అలా చేయడం వలన అంతఃశుద్ధీకరణ జరుగుతుంది.
అలాగే గంగా నదిలో లేదా త్రివేణి సంగమంలో ఆ రోజు నీరు అమృతంతో సమానం అని అంటారు. అందుకని ఆ రోజున పుణ్యస్నానం చేస్తారు.
మౌని అమావాస్య పరిహారాలు
నాగసాధువులులో చేరే వారికి కూడా అది పవిత్రమైన రోజు అని నమ్ముతారు.
రావి చెట్టు నీడలో మౌని అమావాస్య నాడు దీపాలను వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు.
పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది.
ఈ మౌని అమావాస్య మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభాలను చేకూర్చుగాక. సదా మీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని ఆశిస్తూ…


