
ముంబైలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అమితాబ్ బచ్చన్, కాజోల్, రాణీ ముఖర్జీ వంటి బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళు నీట మునిగాయి. ఈ వరదల ప్రభావం విస్తృతంగా ఉంది.
Key Points
ముంబైలోని అమితాబ్ బచ్చన్, కాజోల్, రాణీ ముఖర్జీ ఇళ్లలోకి వరద నీరు చేరింది.
భారీ వర్షాల వల్ల జుహు ప్రాంతంలోని అనేక ప్రముఖుల ఇళ్లు నీట మునిగాయి.
వ్లాగర్ సాగర్ ఠాకూర్ ఈ ఘటనలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ధనవంతులు కూడా ముంబై వర్షాల ప్రభావానికి గురవుతున్నారని ఈ ఘటన వెల్లడించింది.
ముంబైలో భారీ వర్షాలు, వరదలు
ముంబైలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలవడంతో ఇళ్లు నీట మునుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వరద బారిన పడ్డారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉండే దేవగన్లు, బచ్చన్లు, డియోల్లు, చోప్రాలు ఇలా అందరి ఇళ్లలోకి వరద చొచ్చుకొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబై వర్షాల నేపథ్యంలో సాగర్ ఠాకూర్ అనే ఒక వ్లాగర్.. ప్రముఖుల ఇళ్లు ఎలా ప్రభావితమయ్యాయో చూపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశారు. జుహులోని అమితాబ్ బచ్చన్ రెండవ ఇల్లు అయిన ప్రతీక్ష బయట బురద నీరు కాళ్ల వరకు చేరినట్లు అతను చూపించాడు. సాగర్ ప్రధాన గేట్ గుండా లోపలికి వెళ్లి వాచ్మన్ను పరిస్థితి గురించి అడిగాడు. అయితే వెంటనే అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోమని కోరారు.
“ఎంత నీరు నిండిపోయిందో మీరు చూడవచ్చు. అమితాబ్ బచ్చన్ స్వయంగా వైపర్తో నీళ్లు తీస్తున్నారని అంటున్నారు. ఎంత డబ్బు ఉన్నా, 1000 కోట్లు ఉన్నా, ముంబై వర్షాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. అంబానీ అయినా, అమితాబ్ బచ్చన్ అయినా” అని సాగర్ తన ఇన్స్టాగ్రామ్ వ్లాగ్లో అన్నారు.
బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళు నీట మునిగాయి
అమితాబ్ బచ్చన్ ఒక్కడే కాదు.. ముంబైలో ఈ వరద వల్ల పలువురు ఇతర బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అజయ్ దేవగన్- కాజోల్ , ఆదిత్య చోప్రా-రాణీ ముఖర్జీ, డియోల్ కుటుంబాల ఇళ్లను కూడా వ్లాగర్ అయిన సాగర్ చూపించాడు. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల తర్వాత ఆ ఇళ్ల చుట్టూ ఉన్న వీధులన్నీ పూర్తిగా నీటితో నిండిపోయాయి.
సెలబ్రిటీల ఇళ్ల పరిస్థితి చూసి పలువురు ఆశ్చర్యపోయారు. ఒక కామెంట్లో “ఎందుకు పెద్దవారి ఇళ్లను చూపిస్తున్నారు.. పేదల ఇళ్లను కూడా చూపించండి.. మేము కూడా ముంబైలోనే ఉంటున్నాం కదా” అని రాసి ఉంది. మరొకరు “అమితాబ్ బచ్చన్కు దేవుడితో ప్రత్యేక స్నేహం ఉందా.. అందుకే వారి ఇల్లు మునిగిపోదని అనుకున్నారా?” అని రాశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
గత 24 గంటల్లో మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆరుగురు మరణించగా.. నాందేడ్ జిల్లాలో ఐదుగురు తప్పిపోయినట్లు మహారాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
మొత్తం 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆరు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోహరించాయి. నాందేడ్ జిల్లాలోని ముఖేడ్ ప్రాంతంలో ఎస్డిఆర్ఎఫ్ బృందాలు 293 మందిని రక్షించాయి.
ముంబై వర్షాలు ధనవంతులనో, ప్రముఖులనో వదలలేదని ఈ ఘటన చాటుతోంది. ప్రకృతి ప్రకోపానికి ఎవరూ అతీతం కాదని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది.


