|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mythri Naveen : ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచలేము.. మైత్రీ నిర్మాత కామెంట్స్ వైరల్..

Published: 06-08-2025, 12:48 PM
Mythri Naveen : ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచలేము.. మైత్రీ నిర్మాత కామెంట్స్ వైరల్..

టాలీవుడ్‌లో వేతనాల పెంపుపై సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేతనాలు పెంచడం అసాధ్యమని అన్నారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆయన వివరించారు.

Key Points

1

టాలీవుడ్‌లో వేతనాల పెంపుపై సినీ కార్మికుల సమ్మె.

2

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ వేతనాలు పెంచలేమని వ్యాఖ్యానించారు.

4

షూటింగ్ ఖర్చులు తగ్గించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

టాలీవుడ్‌లో వేతనాల సమస్య

Mythri Naveen : టాలీవుడ్ లో ప్రస్తుతం అనధికార సమ్మె నడుస్తుంది. ఏకంగా వేతనాలు 30 శాతం పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఫిలిం ఛాంబర్, నిర్మాతలు ఈ సమస్య పరిష్కారానికి ట్రై చేస్తున్నారు. నిర్మాతలు మాత్రం ఈ సమ్మెకు, వేతనాల పెంపుకు వ్యతిరేకంగానే ఉన్నారు.

తాజాగా ఈ సమస్య పై టాలీవుడ్ అగ్ర నిర్మాత సంస్థల్లో ఒకటైన మైత్రీ నిర్మాత నవీన్ మాట్లాడారు. నేడు జరిగిన సు ఫ్రమ్ సో కన్నడ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవీన్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచే అవకాశం లేదు. ఇండస్ట్రీలో సినిమాలకు రిటర్న్స్ బాగా తగ్గాయి. OTT బిజినెస్ లు లేవు. ఎలా చేస్తే మాకు షూటింగ్ కాస్ట్ తగ్గుతుందో అదే చేస్తాము. కొత్తవాళ్లను తీసుకోవాలా, యూనియన్స్ తో వెళ్లాలా అనేది చూస్తాము అని తెలిపారు.

మైత్రీ నిర్మాత నవీన్ వివరణ

సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు

దీంతో నిర్మాతలు ఇప్పుడు ఉన్న సినీ పరిశ్రమ గడ్డుకాలాన్ని సృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచే ఆలోచనలో అయితే లేరని తెలుస్తుంది. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.

టాలీవుడ్‌లో వేతనాల పెంపు సమస్య పరిష్కారం కావాలంటే నిర్మాతలు, కార్మికులు కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.