
ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పేరు, స్వరం, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలు, డీప్ ఫేక్ల కోసం వినియోగించరాదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇతర సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలవనుంది.
Key Points
నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన అనుమతి లేకుండా పేరు, స్వరం, ఫోటోలను వాణిజ్య ప్రకటనలకు వాడకూడదని కోర్టు ఆదేశించింది.
AI, డీప్ ఫేక్స్ వంటి వాటిని వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.
ఈ తీర్పు ఇతర సెలబ్రిటీలకు తమ హక్కుల పరిరక్షణకు ఒక మార్గదర్శకంగా మారనుంది.
నాగార్జున పిటిషన్, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
తన హక్కులకు రక్షణ కల్పించాలంటూ తెలుగు హీరో నాగార్జున.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని పేర్కొంది. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.
AI, డీప్ ఫేక్స్ వినియోగంపై హెచ్చరిక
అయితే నాగార్జున ఫొటోని, గాత్రాన్ని అభ్యంతర కంటెంట్తో పాటు నకిలీ ఎండోర్స్మెంట్, టీ షర్ట్స్ తదితర వ్యాపారాల్లో.. యూట్యూబ్ షార్ట్స్లోనూ ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారని నాగ్ తరఫు న్యాయవాదాలు.. ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నాగ్కి అనుకూలంగా తీర్పు వచ్చింది.
సెలబ్రిటీలకు కొత్త మార్గం, భవిష్యత్తుపై ప్రభావం
ఇక మీదట సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాగార్జున హక్కులకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలకు న్యాయస్థానం ఆదేశించింది. నాగార్జున ఇప్పుడు ఇలా చేయడంతో ముందు ముందు ఇతర సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు విషయమై ఇదే దారిలో వెళ్తారని అనిపిస్తుంది.
నాగార్జున కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టెక్నాలజీ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక కీలకమైన విజయం. ఇది భవిష్యత్తులో సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు బలమైన పునాది వేస్తుంది.


