
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వందో చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుందని తెలిపారు.
Key Points
నాగార్జున వందో సినిమా ప్రాజెక్ట్ ప్రారంభం.
డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా.
'కింగ్ 100 నాటౌట్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
నాగార్జున వందో సినిమా
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు . రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు . అంతకుముందే కుబేర మూవీతో హిట్ కొట్టిన నాగ్ .. కూలీ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు . ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది .
డైరెక్టర్ రా కార్తీక్
ఈ మూవీ తర్వాత నాగార్జున చేయబోయే ప్రాజెక్ట్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది . ఎందుకంటే ఈ సినిమా ఆయన కెరీర్ లో ప్రత్యేకంగా నిలవనుంది . తన రాబోయే చిత్రం నాగార్జున వందో చిత్రంగా కానుంది . ఈ ప్రత్యేక మూవీకి సంబంధించిన కింగ్ నాగ్ హింట్ ఇచ్చేశాడు . తాజాగా జగపతిబాబు టాక్ షోకు హాజరైన డైరెక్టర్ పేరును కూడా రివీల్ చేశాడు . ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం .
సినిమా వివరాలు
తన వందో సినిమాపై దాదాపు ఆరేడు నెలలుగా వర్క్ జరుగుతోందని టాక్ షోలో నాగార్జున తెలిపారు . ఏడాది క్రితమే డైరెక్టర్ రా కార్తీక్ తనకు కథ చెప్పారని అన్నారు . ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది .. కూలీ రిలీజ్ కాగానే మొదలు పెడదామని చెప్పానని తెలిపారు . యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామాగా ఉండనుందని కింగ్ నాగార్జున పంచుకున్నారు . ఈ సినిమాలో నేనే లీడ్ రోల్ చేస్తున్నానని వెల్లడించారు . దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు కింగ్ 100 నాటౌట్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా .. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఇప్పటికే ఆకాశం , నితమ్ ఓరువానం లాంటి చిత్రాలను తెరకెక్కించారు .
చివరగా, నాగార్జున వందో చిత్రం అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని ఆశిద్దాం. రా కార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం అత్యంత విజయవంతమవుతుందని భావిస్తున్నారు.


