|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫస్ట్ రెయిన్ బో అంటూ పిల్లల ఫొటోస్ షేర్ చేసిన లేడీ సూపర్ స్టార్.. పోస్ట్ వైరల్

Published: 30-04-2025, 12:12 AM
ఫస్ట్ రెయిన్ బో అంటూ పిల్లల ఫొటోస్ షేర్ చేసిన లేడీ సూపర్ స్టార్.. పోస్ట్ వైరల్

తెలుగు సినీ రంగంలో ప్రముఖ నటి నయనతార తన ఇద్దరు పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘ఫస్ట్ రెయిన్ బో’ అంటూ పోస్ట్ చేసిన ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Key Points

1

నయనతార తన పిల్లల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

2

పిల్లలు మొదటిసారి వర్షపు నీటితో ఆడుకుంటున్న ఫోటోలు పోస్ట్ చేశారు.

4

నెటిజన్లు పోస్ట్‌కు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.

నయనతార ఇన్‌స్టా పోస్ట్

‘లక్ష్మి’(Lakshmi) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి అలరించింది. ఇక ‘జవాన్’(Jawan) మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తుంది.

పిల్లలతో ఆనందం

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌(Vignesh Shivan)తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక సరోగసి ద్వారా ఇద్దరు బాబులకు తల్లి కూడా అయింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో లైష్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నయనతార తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో తన బాయ్స్ రెయిన్ బోను చూస్తున్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘ఫస్ట్ రెయిన్ బో’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అయిన ఫోటోలు

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

నయనతార తన కుటుంబంతో గడుపుతున్న సంతోషకరమైన క్షణాలను అభిమానులతో పంచుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వైరల్ పోస్ట్ ఆమెకు మరిన్ని శుభాకాంక్షలు తెచ్చిపెట్టింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.