
సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసిన నిత్యామీనన్ ఇప్పుడు ‘ఇడ్లీ కడై’ సినిమా కోసం పిడకలు చేయడం నేర్చుకుంది. జాతీయ అవార్డును అందుకున్న రోజున ఆమె చేసిన విశేష అనుభవం ఇది.
Key Points
నిత్యామీనన్ తొలిసారిగా పిడకలు చేసింది.
ఇడ్లీ కడై సినిమా షూటింగ్ సమయంలో ఈ అనుభవం.
జాతీయ అవార్డు అందుకున్న రోజు వేలి గోర్లలో పేడ ఉంది.
ఈ సినిమా ద్వారా విభిన్నమైన అనుభవాలు పొందింది.
ఇడ్లీ కడై సినిమా షూటింగ్ అనుభవం
సినిమా అంటే ఇష్టం లేదంటుంది. కానీ సినిమా కోసం ఏదైనా చేస్తుంది. సినిమాలు మానేయాలని ఆలోచిస్తుంది. కానీ తను అడుగుపెట్టిన ప్రతి ప్రాజెక్టులో అద్భుతంగా నటిస్తుంది. అలా తరుచిత్రంబళం (తెలుగులో తిరు) సినిమాకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది నిత్యామీనన్ ( Nithya Menen ). ప్రస్తుతం ఈ బ్యూటీ ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) ( Idly Kadai Movie ) సినిమా చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్య.. పల్లెటూరి యువతిగా కనిపించనుంది.
పిడకలు చేశా.. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే తిరు సినిమాకు వచ్చిన జాతీయ అవార్డును అందుకోవడానికి వెళ్లింది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ కడై సినిమా కోసం నేను పిడకలు చేయడం నేర్చుకున్నాను. పిడకలు చేయడానికి సమ్మతమేనా? అని అడగ్గానే ఎందుకు చేయను? అని రంగంలోకి దిగాను. నా జీవితంలో తొలిసారి పేడ చేతిలో పట్టుకుని దాన్ని గుండ్రంగా పిడకలు చేశాను. పిడకలు చేసిన మరునాడే జాతీయ అవార్డు తీసుకునేందుకు వెళ్లాను. అప్పుడు నా వేలి గోర్లలో ఆ పేడ ఇంకా అలాగే ఉంది.
జాతీయ అవార్డుతో కలిసిన విశేషం
ఇంత మంచి అనుభూతి.. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ద్వారా విభిన్నమైన విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీ చేయకపోయుంటే ఇంత మంచి అనుభూతి నాకు దక్కేదే కాదు అని చెప్పుకొచ్చింది. ఇడ్లీ కడై విషయానికి వస్తే తిరుచిత్రంబలం సినిమా తర్వాత ధనుష్- నిత్య కాంబినేషన్లో వస్తున్న రెండో మూవీ ఇది! ఇందులో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, పార్తీబన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.
నిత్యామీనన్ మాటల్లో అనుభవం
ఇడ్లీ కడై సినిమా ద్వారా నిత్యామీనన్ కొత్త అనుభవాలను పొందింది. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానున్నందున ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


