
కల్యాణ్ రామ్ మరియు విజయశాంతి నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన తర్వాత, ఇప్పుడు ఆహా ఓటీటీలో కూడా విడుదల కానుంది. తల్లి కొడుకుల మధ్య సంఘర్షణాత్మకమైన ఈ కథ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Key Points
కల్యాణ్ రామ్, విజయశాంతి నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మే 23 నుంచి ఆహా ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తల్లి కొడుకుల మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా ఇది.
థియేటర్ రిలీజ్ తర్వాత వేగంగా ఓటీటీకి చేరుకున్న ఈ చిత్రం రెండో ఓటీటీలో ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి రెండో ఓటీటీలోకి
ఒకే సినిమా రెండు మూడు ఓటీటీల్లోనూ రిలీజ్ అయిన సందర్భాలు అడపాదడపా ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది లేటెస్ట్ తెలుగు మూవీ. కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ఇప్పటికే ఒకదానిలో రిలీజ్ కాగా.. ఇప్పుడు మరో దానిలోకి కూడా రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. రిలీజ్ కి ముందు చాలా హడావుడి చేశారు గానీ సినిమాలో అంత సీన్ లేకపోయేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కట్ చేస్తే థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 16) నుంచి అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ తర్వాత ఆహాలో రిలీజ్
ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ వచ్చే శుక్రవారం (మే 23) నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. తల్లికొడుకుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ ఎమోషనల్ డ్రామా మరి ఓటీటీలో ఏ మేరకు రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?
తల్లి కొడుకుల కథాంశం
అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికొస్తే.. వైజయంతి (విజయశాంతి) సిన్సియర్ పోలీసాఫీసర్. ఈమె కొడుకు అర్జున్ కూడా పోలీస్ అయ్యేందుకు కష్టపడుతుంటారు. కానీ ఓ సందర్భంలో తన తండ్రిని చంపిన హంతకుడిని అందరూ చూస్తుండానే అర్జున్ చంపేస్తాడు. దీంతో తల్లికొడుకుల మధ్యం దూరం పెరుగుతుంది. మరి వీళ్లిద్దరూ కలిశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి : రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు )
చివరగా, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా రెండు ఓటీటీల్లో విడుదల కావడం విశేషం. రెండో ఓటీటీలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


