|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

Published: 05-06-2025, 1:24 AM
ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

బాలీవుడ్‌లోకి తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెచ్చిన జాట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రూ. 120 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Key Points

1

రూ.120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన జాట్ సినిమా ఓటీటీలో విడుదలైంది.

2

సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

4

తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లోని మోటుపల్లి గ్రామాన్ని నేపథ్యంగా చిత్రీకరించబడింది.

జాట్ సినిమా విడుదల వివరాలు

తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్‌. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ హీరోగా టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌  ‘జాట్‌’ ఏప్రిల్‌ 10న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌  నిర్మించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జాట్‌.. బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.120 కోట్ల వరకు రాబట్టింది.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో రణదీప్‌ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్‌ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు.

కథాంశం గురించి

ఆంధ్రప్రదేశ్‍లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్‍దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా  అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్‌ (సన్నీ డియోల్‌)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్‌కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్‌ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది.  ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్‌. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్‌తో జాట్‌ రెచ్చిపోతాడు. ఈ విషయం  కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్‌ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్‌కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

రూ. 120 కోట్లు వసూలు చేసిన జాట్ సినిమా ఓటీటీలో విడుదలవడం తెలుగు ప్రేక్షకులకు మరో అవకాశం. సన్నీ డియోల్, రణదీప్ హుడా నటనతో ఈ సినిమా వినోదాన్ని అందిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.