
📌 Key Points
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.
- డ్రాఫ్ట్ మెసేజ్ను తొలగించకుండానే పోస్ట్ చేయడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
- అమెరికా సూచనల మేరకే పాక్ వ్యవహరిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- పాక్ ప్రధాని సొంతంగా ట్వీట్ కూడా చేయలేరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. డ్రాఫ్ట్ మెసేజ్ను కాపీ-పేస్ట్ చేస్తూ దొరికిపోవడంతో నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
ట్వీట్లో దొరికిపోయిన డ్రాఫ్ట్ మెసేజ్
ఓ పక్క అమెరికా- ఇరాన్ రెండు వారాల కాల్పుల విరమణ (ceasefire) వేళ యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని (Prime Minister of Pakistan) మాత్రం నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో చేసిన ఒక పొరపాటు నెట్టింట పెను దుమారం రేపుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్కు విధించిన గడువును రెండు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ఆయన ఒక పోస్ట్ చేశారు. అయితే, ఆ మెసేజ్ను పంపేటప్పుడు దాని పైభాగంలో ఉన్న “Draft – Pakistan’s PM Message on X” అనే హెడ్డింగ్ను తొలగించడం మర్చిపోయారు. కొద్దిసేపటికే ఆ పొరపాటును గుర్తించి ఎడిట్ చేసినప్పటికీ, అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
అమెరికా కీలుబొమ్మ అంటూ విమర్శలు
అమెరికా కీలుబొమ్మ అంటూ విమర్శలు
పాక్ దౌత్య స్వతంత్రతపై చర్చ
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు పాకిస్తాన్ ప్రధానిని ఏకి పారేస్తున్నారు. అసలు ఆ మెసేజ్ ప్రధాని కార్యాలయం సొంతంగా రాసిందా? లేక ఎవరైనా పంపిన ‘రెడీమేడ్’ స్క్రిప్ట్ను అలాగే కాపీ పేస్ట్ చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆ మెసేజ్లో వాడిన భాష, డ్రాఫ్ట్ స్టైల్ చూస్తుంటే అది వైట్ హౌస్ (అమెరికా) నుంచి వచ్చిన సూచనలలా ఉన్నాయని, అమెరికా ఏం చెబితే పాక్ అదే చేస్తోందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. “సొంతంగా ఒక ట్వీట్ కూడా రాసుకోలేని స్థితిలో ప్రధాని ఉన్నారా?” అంటూ పాక్ నెటిజన్లే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం పాకిస్తాన్ దౌత్యపరమైన స్వతంత్రతపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
ఈ ఘటన పాకిస్తాన్ యొక్క దౌత్యపరమైన స్వతంత్రతను ప్రశ్నార్థకం చేసింది. అంతర్జాతీయంగా పాక్ వ్యవహార శైలిపై ఇది తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


