
ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు అజయ్ దేవగన్ తండ్రి ఇచ్చిన సలహా మేరకు ఆయన చేసిన పని ఏంటో తెలుసుకుందాం.
Key Points
ప్రముఖ నటుడు పరేశ్ రావల్ తన అనారోగ్య సమయంలో ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టాడు.
అజయ్ దేవగన్ తండ్రి సూచన మేరకు 15 రోజులు తన మూత్రం తాగాడని వెల్లడించాడు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
నటుడి నిర్ణయంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పరేశ్ రావల్ ఆశ్చర్యకర వెల్లడి
ప్రముఖ నటుడు పరేశ్ రావల్ కామెడీ టైమింగ్తో అయినా.. సీరియస్ క్యారెక్టర్ అయినా.. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో డాక్టర్ మాయ్యగా కనిపించిన ఆయన.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కనిపించాడు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విషయాన్ని షేర్ చేసి షాక్ ఇచ్చాడు. తను అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సమయంలో తనను కలిసేందుకు హీరో అజయ్ దేవగన్, తన తండ్రితో కలిసి వచ్చారని.. ఆ టైమ్లో ఆయన ఫాదర్ ఓ సజెషన్ ఇచ్చాడని తెలిపాడు. ఎవరి మూత్రం వారు తాగితే త్వరగా క్యూర్ అవుతారని చెప్పాడని.. దీంతో తను గుడ్డిగా ఫాలో అయిపోయానని వివరించాడు. దాదాపు 15రోజులు అలాగే చేసేసరికి హెల్త్ ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆవు మూత్రం తాగమని చెప్తే.. తాగితే ఓ రకం.. కానీ మరీ ఎవరి మూత్రం వారు తాగడం ఏంటి? ఆ విషయాన్ని బ్లైండ్గా ఫాలో కావడం ఏంటి? కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదా? సూపర్ స్టార్ తండ్రి ఏది చెప్పినా చేస్తారా ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంత గొప్ప నటుడు ఇంత దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడంటే నమ్మశక్యంగా లేదని కొందరు అంటుంటే.. ఇది నిజంగా ఎనిమిదో వింత అని విమర్శిస్తున్నారు.
అజయ్ దేవగన్ తండ్రి సూచన
సోషల్ మీడియాలో చర్చ
పరేశ్ రావల్ అనుభవం చాలా వివాదాస్పదంగా మారింది. ఆయన నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పద్ధతులకు అంగీకరించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.


