
📌 Key Points
- ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య 20 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది.
- యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాలలో చమురు కొరత ఏర్పడింది.
- శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు 25 శాతం పెరిగాయి.
- లీటర్ పెట్రోల్ ధర రూ. 398కి, డీజిల్ ధర రూ. 382కు చేరింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలలో చమురు కొరత ఏర్పడింది. దీని ప్రభావంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచారు. ఈ నిర్ణయం వాహనదారులకు తీవ్ర భారంగా మారింది.
గల్ఫ్ సంక్షోభంతో చమురు కొరత
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు దేశాల మధ్య దాదాపు 20 రోజులకు పైగా వార్ కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపైన కూడా పడింది. దీనివల్ల ఇండియాతో పాటు పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాలలో చమురు కొరత ఏర్పడింది. ఇండియాలో ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర పెరగగా, శ్రీలంకలోని వాహనదారులకు అక్కడి ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది.
శ్రీలంకలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
గల్ఫ్ దేశాలలో సంక్షోభం కారణంగా శ్రీలంకలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ సారి ఏకంగా 25 శాతం ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది శ్రీలంక సర్కార్. దీంతో వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఆ దేశంలో చమురు ధరలు పెరిగాయి. ఈ దెబ్బకు వాహనదారులు లబోదిబోమంటున్నారు. లేటెస్ట్ గా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనాలు బయటకు తీయాలంటే గజగజ వణికి పోతున్నారు. సవరణ చేసిన తర్వాత శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 317 నుంచి రూ. 398లకు చేరుకుంది. డీజిల్ ధర రూ. 79 పెంచడంతో రూ. 382 కు చేరుకుంది. అదే సమయంలో రిటైల్ ఇంధన ధరలను కూడా ఎనిమిది శాతం పెంచింది శ్రీలంక సర్కార్.
వాహనదారులపై తీవ్ర ప్రభావం
A post shared by NEWS9 (@news9live)
శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ధరల పెరుగుదల వారి జీవన విధానంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.


