|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డీలిమిటేషన్‌పై మోడీ సంచలన ప్రకటన! ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం జరగదంటూ పార్లమెంట్‌లో హామీ!!

Published: 16-04-2026, 7:05 AM
డీలిమిటేషన్‌పై మోడీ సంచలన ప్రకటన! ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం జరగదంటూ పార్లమెంట్‌లో హామీ!!
  • ఉత్తరాది, దక్షిణాది అని తేడా లేదు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమానమేనన్న మోడీ.
  • డీలిమిటేషన్ బిల్లుతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చిన ప్రధాని.
  • మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టీకరణ.
  • ఓబీసీలకు తప్పకుండా న్యాయం చేస్తామని పార్లమెంట్ వేదికగా మోడీ ప్రకటన.

డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వార్తలపై ప్రధాని మోడీ పార్లమెంట్ వేదికగా స్పందించారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.

డీలిమిటేషన్‌పై ప్రధాని మోడీ స్పష్టీకరణ

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చారు. ఉత్తరాది, దక్షిణాది అని మాకు తేడా లేదని కశ్మీర్ టు కన్యాకుమారి అన్ని ప్రాంతాలు మాకు సమానమేనన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదన్నారు. మీకు గ్యారెంటీ కావాలంటే నా మాటే గ్యారెంటీ అన్నారు. ఇవాళ లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఏ రాష్ట్రంపైనా మాకు వివక్ష లేదన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ వ్యాఖ్యలు

మోడీ స్వార్థం కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తే నాకే లాభం అని మహిలా రిజర్వేషన్ బిల్లుపై నాకు క్రెడిట్ అవసరం లేదన్నారు. అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు ప్రకటన ఇస్తానన్నారు. పంచాయతీల్లో మహిలా రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు. లోక్ సభలో అమలు చేస్తుంటే అడ్డుకుంటున్నారు. మహిళల్లో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. పంచాయతీల్లోనే కాదు అత్యున్నత చట్టసభల్లోనూ భాగస్వామ్యం కోరుకుంటున్నారు. పార్లమెంట్ పై నాకు నమ్మకం ఉందని వెనుకబడిన వర్గానికి చెందిన నాకు ప్రధాని పదవి దక్కింది. తప్పకుండా ఓబీసీలకు న్యాయం చేస్తామన్నారు.

ఓబీసీలకు న్యాయం చేస్తామన్న ప్రధాని

వాళ్లను మహిళలే చెప్పుతో కొడతారు: పార్లమెంట్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియలో చిన్న రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.