
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పెద్ద హీరోల సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోతున్నాయి. దీనికి కారణాలు ఏమిటో, దర్శకులు, నిర్మాతలు ఎలా స్పందిస్తున్నారో ఈ కథనం వివరిస్తుంది.
Key Points
త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఫ్లాప్ అవడంతో దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్ర నిరాశకు గురయ్యారు.
రాంచరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సినిమాలతో సహా పెద్ద హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రేక్షకులను బలవంతంగా థియేటర్లకు తీసుకురావడం సాధ్యం కాదని అన్నారు.
సినిమా ప్రమోషన్స్ లో అతిగా హైప్ చేయడం కూడా ప్రేక్షకులను అలసిపోయేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు.
సినిమా పరిశ్రమలో సంక్షోభం
ప్రస్తుతం చిత్ర పరిశ్రమకి గడ్డు కాలం నడుస్తోంది. థియేటర్లలో సినిమాలకు ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించడం లేదు. ఓ మోస్తరు టాక్ ఉన్న సినిమాలకు కూడా ఆడియన్స్ వెళ్లడం లేదు. సూపర్ హిట్ సినిమాలని మాత్రమే థియేటర్లలో ఆదరిస్తున్నారు. ఫ్లాప్ సినిమాల గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు నటించిన చిత్రాలకు ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ.. రెండు వారలు కూడా థియేటర్లలో నిలబడడం లేదు.
ఇటీవల త్రిబాణధారి బార్బరిక్ అనే చిత్రం విడుదలైంది . మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి థియేటర్లలో సరైన ఆదరణ లభించలేదు. దర్శకుడు మంచి ప్రయత్నం చేశారు అనే కామెంట్స్ వినిపించాయి కానీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళలేదు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన దర్శకుడు మోహన్ శ్రీవత్స తన చెప్పుతో తానే కొట్టుకున్నారు.
త్రిబాణధారి బార్బరిక్ చిత్రం ఫ్లాప్
ఆ తర్వాత తాను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అన్నారు. తన చిత్రానికి ఆదరణ దక్కకపోయే సరికి తట్టుకోలేకపోయాను అని మోహన్ తెలిపారు. మోహన్ శ్రీవత్స తనని తాను చెప్పుతో కొట్టుకోవడంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నాని నిర్మించిన కోర్ట్, 35 చిన్న కథ కాదు, 23 లాంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. ప్రేక్షకులని బలవంతంగా థియేటర్లకు రప్పించాలి అనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళకి నచ్చితే వస్తారు లేకుంటే లేదు. దానికి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు అని తమ్మారెడ్డి అన్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ భారీ చిత్రం అది పోయింది కదా.. ఎన్టీఆర్ వార్ 2 పోయింది.. రాంచరణ్ గేమ్ ఛేంజర్ కూడా పోయింది. పెద్ద పెద్ద హీరోల సినిమాలే పోతున్నాయి.. మరి ఈయనకు(మోహన్ శ్రీవత్స) ఎందుకు అంత బాధ అని తమ్మారెడ్డి సెటైర్లు వేశారు.
దర్శక నిర్మాతల అభిప్రాయాలు
సినిమా ప్రమోషన్స్ లో కొందరు సెలెబ్రిటీలు చేస్తున్న ప్రసంగాలు కూడా బూమరాంగ్ అవుతున్నాయి అని తమ్మారెడ్డి అన్నారు. మేము చించేశాం పొడిచేశాం అని చెబితే ఆడియన్స్ నమ్మరు. మేము చాలా కష్టపడ్డాం వచ్చి సినిమా చూడండి అని ఆడియన్స్ ని అడగడం కూడా కరెక్ట్ కాదు. నీ కోసం నువ్వు కష్టపడినప్పుడు ఆడియన్స్ వచ్చి ఎందుకు సినిమా చూడాలి.. ఆ మూవీ బావుంటే వచ్చి చూస్తారు అని తమ్మారెడ్డి అన్నారు.
ప్రేక్షకుల ఆదరణే సినిమా విజయానికి కీలకం. అతిగా ప్రచారం చేయడం కంటే మంచి కంటెంట్ అందించడం చాలా ముఖ్యం అని ఈ ఘటన తెలియజేస్తోంది.

