
టాలీవుడ్ దిగ్గజ నటుడు రంగనాథ్ జీవితం, ఆయన ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, రూ.800 అద్దె ఇంట్లో నివాసంపై ఆయన కొడుకు నాగేంద్రకుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. భార్య అనారోగ్యం, పనిమనిషికి ఆస్తితో పాటు తన భార్య విషాద మరణం గురించి వివరించారు. ఈ వివరాలు అభిమానులను కదిలిస్తున్నాయి.
Key Points
నటుడు రంగనాథ్ 2015లో తన నివాసంలో ఉరేసుకుని చనిపోయారు.
సినిమాలు తగ్గడంతో రూ.2,500 నుంచి రూ.800 అద్దె ఇంటికి మారాం: నాగేంద్ర కుమార్.
రంగనాథ్ చనిపోయే ముందు పనిమనిషి మీనాక్షి కోసం కొంత ఆస్తి రాసిచ్చారు.
నా భార్య 9 సార్లు చనిపోయేందుకు ప్రయత్నించి, 10వ సారి అధిక డోసుతో ప్రాణాలు కోల్పోయింది: నాగేంద్ర కుమార్.
రంగనాథ్ కుటుంబ నేపథ్యం, ఆర్థిక కష్టాలు
పెద్దరికం, రాజసం, గాంభీర్యం.. ఆయన కనిపిస్తే ఇవన్నీ కలపోసినట్లుగా ఉంటాయి. ఆయనే టాలీవుడ్ నటుడు రంగనాథ్. మూడు వందలకు పైగా సినిమాలు చేసిన ఆయన 2015లో తన నివాసంలో ఉరేసుకుని చనిపోయారు. గోడలపై పనిమనిషి మీనాక్షి పేరు రాసి తన పేరిట ఉన్న బాండ్స్ను ఆమెకు అప్పగించాలని కోరారు. రంగనాథ్ జీవితం గురించి, చివరి రోజుల గురించి ఆయన కుమారుడు నాగేంద్ర కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అమ్మ చనిపోయాక.. ‘1995లో అమ్మ మంచానపడింది. నడుము కింది భాగానికి స్పర్శ లేకుండా పోయింది. తను ఎప్పటికీ కోలుకోలేదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నాన్న, నేను ఇంటిపనులు విభజించుకున్నాం. నాన్న వంట చేస్తే నేను ఇల్లు తుడిచి గిన్నెలు తోమేవాడిని. అమ్మ బాత్రూమ్ వెళ్తే కూడా మేమిద్దరమే క్లీన్ చేసేవాళ్లం. మనుషుల్ని మాట్లాడుకున్నా కొద్దిరోజులకే పని మానేసేవారు. అక్క పెళ్లి కోసం నాన్న ఇల్లమ్మేశాడు. అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం.
పనిమనిషికి ఆస్తి.. కొడుకు దుబాయ్ ప్రయాణం
రూ.800 అద్దె ఇంట్లోకి.. సినిమాలు తగ్గిపోవడంతో రూ.2,500 అద్దె కడుతున్న ఇంటి నుంచి రూ.800 అద్దె ఉన్న ఇంటికి మారాం. ఆర్థిక పరిస్థితి బాగోలేదని అర్థమైంది. ఇలాగైతే కష్టమని నేను దుబాయ్ వెళ్లి సంపాదిస్తానన్నాను. నాన్న ఒప్పుకోకపోయినా దుబాయ్ వెళ్లాను. అందుకు నాపై కోపంతో ఏడాదిన్నరపాటు మాట్లాడలేదు. అయినా అక్కడే రెండేండ్లు ఉండి ఇండియాకు వచ్చేశా.. అమ్మకోసమైనా ఉండిపోరా అన్నాడు.
అందుకే పనిమనిషికి ఆస్తి మళ్లీ రూ.2500 అద్దె ఉన్న పాత అపార్ట్మెంట్కు షిఫ్ట్ అయ్యాము. మీనాక్షి మా పనిమనిషి. అమ్మను బాగా చూసుకునేది. అమ్మ చనిపోయాక నాన్నను మాతో పాటు రమ్మన్నాం. కానీ నాన్న ప్రైవసీ కావాలన్నారు. స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు. ఆయనకు అడ్డు చెప్పలేకపోయాం. మీనాక్షి.. తనకు ఇల్లు కావాలని అడిగిందని విన్నాను. అందుకే నాన్న చనిపోయేముందు ఆమె కోసం కొంత ఆస్తి రాసిచ్చి పోయాడు. ఏదేమైనా మా అమ్మానాన్న కోసం చాలా సేవ చేశావని మీనాక్షి కాళ్లపై పడి దండం పెట్టుకున్నాను.
నాగేంద్రకుమార్ భార్య విషాదకర మరణం
పదోసారి ప్రాణం పోయింది నేను కట్టుకున్న భార్య గతేడాది చనిపోయింది. ఆమె మనసు స్థిమితంగా ఉండదు. తొమ్మిదిసార్లు చనిపోయేందుకు ప్రయత్నించింది. ప్రతిచిన్నదానికి ఎక్కువ భయపడి, బెదిరిపోయి ట్యాబ్లెట్లు మింగేది. పదోసారి అలాగే చేసింది. కానీ, ఈసారి డోసు ఎక్కువయ్యేసరికి చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు. అప్పుడే బంధుత్వాలను తెంచేసుకున్నా.. నా కొడుకుతో బతుకున్నాను. నాన్న ఎడమచేతికి తెలియకుండా కుడిచేత్తో దానధర్మాలు చేసేవాడు. ఆయన సంపాదించిందంతా ఆయనే ఖర్చు చేశారు. మాకేమీ ఇవ్వలేదు’ అని నాగేంద్ర కుమార్ చెప్పుకొచ్చాడు.
రంగనాథ్ కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక, వ్యక్తిగత కష్టాలు, ఆయన కొడుకు నాగేంద్రకుమార్ జీవితంలో జరిగిన విషాద సంఘటనలు ఎంతోమందికి తెలియని వాస్తవాలు. ఈ ఆవేదనభరిత గాథ టాలీవుడ్లో ఓ సినీ ప్రముఖుడి తెరవెనుక జీవితాన్ని ఆవిష్కరిస్తుంది.


