|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎవరు ఎలా అనుకున్నా నేను నేనే.. నేషనల్ క్రష్ రష్మిక సంచలన కామెంట్స్

Published: 07-08-2025, 11:51 AM
ఎవరు ఎలా అనుకున్నా నేను నేనే.. నేషనల్ క్రష్ రష్మిక సంచలన కామెంట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో అలరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఫేక్ పీఆర్ మరియు సోషల్ మీడియా ట్రోలింగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఎవరు ఎలా అనుకున్నా నేను నేనే’ అంటూ ఆమె స్పష్టం చేసింది.

Key Points

1

రష్మిక మందన్న తన వరుస సినిమాలతో సందడి చేస్తోంది.

2

ఫేక్ పీఆర్ మరియు సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై రష్మిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

4

‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రష్మిక మందన్న వరుస సినిమాలు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ఈ ఏడాది చావా, సికందర్, కుబేరా వంటి సినిమాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరోయిన్.. త్వరలో గర్ల్‌ఫ్రెండ్ చిత్రంతో థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఫేక్ పీఆర్, సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై ఫైర్ అయ్యింది. ‘మీరు ఎదుటి వారి పట్ల దయగా లేనప్పుడు.. కనీసం మౌనంగా ఉండండి.. ప్రజలను ఊపిరి పీల్చుకోనివ్వండి. ఇతరులు ఎదుగుతున్నప్పుడు ఎందుకు వారిని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అందరికి ఎదిగే స్థలం ఉంది.. అలాగే కొందరు ఆమె కెమెరా కోసం చేస్తోంది.. ఫేక్ అంటూ ట్రోల్స్ చేస్తుంటారు. ఎవరు ఎలా అనుకున్నా నేను నేనే’ అని తెలిపింది ఈ బ్యూటీ.

ఫేక్ పీఆర్ పై రష్మిక స్పందన

‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా అప్డేట్

రష్మిక మందన్న తన స్వంత విజయాలపై దృష్టి పెట్టి, విమర్శలకు లొంగకుండా ముందుకు సాగుతుందని ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.