
టాలీవుడ్ నటి రష్మిక మందన్న తన తల్లిదండ్రుల ఫోటోను ఫాదర్స్ డే సందర్భంగా పంచుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారిని చూసి ఎంతోకాలం అయిందని ఆమె పేర్కొంది.
Key Points
రష్మిక మందన్న తన తల్లిదండ్రుల ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఫోటోను పోస్ట్ చేసింది.
వారిని చూసి చాలా కాలం అయిందని, త్వరలో కలవాలని ఆమె పేర్కొంది.
రష్మిక మందన్న యొక్క సినిమా జీవితం మరియు వృత్తిపరమైన విజయాల గురించి ఈ పోస్ట్ చర్చిస్తుంది.
రష్మిక మందన్న ఫ్యామిలీ ఫోటో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2014 లో మోడలింగ్ ప్రారంభించి.. అదే ఏడాదిలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది. తర్వాత నేషనల్ క్రష్ కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత ఈ హీరోయిన్ పునీత్ రాజ్ కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్కు జోడిగా ఛమక్ అనే మూవీల్లో అవకాశం కొట్టేసింది. నాగశౌర్యతో కలిసి ఛలో సినిమాలో అదర్భుతంగా నటించి.. తన క్యూట్నెస్లో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ భామ వరుస చిత్రాలతో అలరించింది.
ఫాదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్
దేవదాస్, గోత గోవిందం, యజమన, డియర్ కామ్రేడ్, భీషు, పొగరు, సుల్తాన్, పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు, సీతారామం, వారసుడు, మిషజ్ మజ్ను, యానిమల్, పుష్ప ది రూల్, ఛావా సికందర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుందన్న విషయం తెలిసిందే.
రష్మిక సినీ జీవితం
అయితే నేడు ఫాదర్స్ డే సందర్భంగా రష్మిక తన అమ్మనాన్నల ఫొటో పంచుకుని వారిపై ప్రేమను చాటింది. ‘‘మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మను, నన్ను, శిమ్మును ఇంతకాలం సూపర్ హీరోలా వీపుపై మోసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నేను మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము. నిన్ను నిజంగా చూసి సంవత్సరం కంటే ఎక్కువ అయ్యింది. త్వరలో నిన్ను కౌగిలించుకోవడానికి నేను వేచి ఉండలేను’’. అంటూ రాసుకొచ్చింది.
రష్మిక తన తల్లిదండ్రులతో ఉన్న ప్రేమను ఈ ఫోటో ద్వారా చూపించింది. వారితో త్వరలోనే కలుసుకునేందుకు ఆమె ఎదురు చూస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


