
సినీ పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చపై నటి రష్మిక మందన్న తాజాగా స్పందించారు. నటీనటులతో సహా అందరికీ నిర్దిష్ట పనివేళలు ఉండాలని, దానివల్ల కుటుంబానికి సమయం కేటాయించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Key Points
పనివేళలు అందరికీ నిర్దిష్టంగా ఉండాలని రష్మిక ఆకాంక్ష.
కుటుంబంతో గడిపే సమయం కోసం పని గంటల నియంత్రణ అవసరం.
భవిష్యత్తు, తల్లిగా తన జీవితం గురించి ఆలోచిస్తున్న రష్మిక.
రష్మిక తదుపరి చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న విడుదల.
రష్మిక వర్కింగ్ అవర్స్ వ్యాఖ్యలు
సినీ నటీనటుల పని గంటలపై గతకొంత కాలంగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే . దీనిపై తాజాగా హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) స్పందించారు. నిర్దిష్ట పనివేళలు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు . ‘ ది గర్ల్ ప్రెండ్ ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ .. ‘ నటీనటులకే కాదు దర్శకుల నుంచి లైట్ మ్యాన్ వరకు అందరికీ నిర్దిష్ట పనివేళలు ఉంటే బాగుంటుంది . దాని వల్ల కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుంది .
సినీ పరిశ్రమలో పని గంటలపై చర్చ
ఇకపై నేను ఫ్యామిలీపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నా . భవిష్యత్తు గురించే నా ఆలోచనంతా. తల్లిని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడే ఊహిస్తుంటా ’ అని రష్మిక అన్నారు .
‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ విశేషాలు
ఎనిమిది గంటలే పని చేస్తానని డిమాండ్ చేయడంతో దీపికా పదుకొణెను స్పిరిట్ చిత్రం నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే . ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు వర్కింగ్ అవర్స్ పై స్పందించారు . ది గర్ల్ ఫ్రెండ్ విషయానికొస్తే .. ఇదొక ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7 న రిలీజ్ కానుంది .
రష్మిక వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పని గంటల అంశానికి మరింత ప్రాధాన్యతను ఇచ్చాయి. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం సమతుల్యతపై ఆమె అభిప్రాయాలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె కొత్త సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ విడుదలపై కూడా ఆసక్తి నెలకొంది.


