
టాలీవుడ్లో కొనసాగుతున్న కార్మికుల సమ్మెపై ప్రముఖుడు ఆర్. నారాయణమూర్తి స్పందించారు. వేతనాల పెంపు, ఫెడరేషన్ పాత్రపై ఆయన అభిప్రాయాలు వెల్లడించారు.
Key Points
టాలీవుడ్ కార్మికుల సమ్మెకు ఆర్. నారాయణమూర్తి స్పందన
నిర్మాతలు వేతనాలు పెంచాలని, ఫెడరేషన్ ఆలోచించాలని సూచన
కార్మికుల హక్కులను కాపాడాలని నారాయణమూర్తి పిలుపు
చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవసరం అని నారాయణమూర్తి అభిప్రాయం
టాలీవుడ్ కార్మికుల సమ్మె
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు ఇచ్చే వేతనాలు 30 శాతం మేర పెంచాలని వర్కర్స్ కోరగా.. నిర్మాతలు వైపు నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు. పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ.. ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. ఇలాంటి టైంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్పందించారు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు..
ఆర్. నారాయణమూర్తి స్పందన
‘సినీ కార్మికులు.. నిర్మాతలు కలసి చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కార్మికులు అడుగుతున్న వేతనాలు నిర్మాతలు పెంచాలి. కార్మికులను గౌరవిస్తూ వాళ్ల హక్కులను కాపాడాలి. మూడు యూనియన్లకు వేతనాలు పెంచకుండా మిగతా యూనియన్లకు పెంచడం ఏమిటి? అందరితోపాటు వాళ్లకు పెంచాలి. నిర్మాతలు కోరుతున్న ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ 9 నుంచి 9 గంటల విషయమై కార్మికులు కూడా ఆలోచించాలి. ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో 6 నుంచి 6 గంటల వరకు నిర్మాతలకు ఇబ్బంది అవుతోంది అందుకే ఫెడరేషన్ కూడా ఆలోచించాలి’
సమస్య పరిష్కార మార్గాలు
‘త్వరగా ఇరువురు సమ్మె విరమించి మళ్లీ షూటింగ్స్తో కళకళ లాడాలి. కార్మికులు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే నిరాహారదీక్ష చేస్తాం అని ఫెడరేషన్ సంఘాలు అంటున్నాయి. అక్కడివరకు పరిస్థితి రాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి’ అని నారాయణమూర్తి చెప్పారు. మరి ఇండస్ట్రీలోని ఈ సమస్యకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి?
టాలీవుడ్లోని ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని ఆశిద్దాం. చర్చల ద్వారా సామరస్యం ఏర్పడి, సినిమా షూటింగ్స్ మళ్లీ ప్రారంభమవ్వాలి.


