
📌 Key Points
- TGSRTC హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లను భారీగా పెంచింది.
- పీనియా, చందాపూర్, మార్తహళ్లి రూట్లలో బెంగళూరులో కొత్త స్టాప్లు అందుబాటులోకి వచ్చాయి.
- పటాన్చెరు, జేబీఎస్, హయత్నగర్ రూట్లలో హైదరాబాద్లో ప్రధాన స్టేజీలలో బస్సులు ఆగుతాయి.
- ప్రయాణికులు తమకు దగ్గరలోని పాయింట్ల నుంచి బస్సులు ఎక్కవచ్చు, దిగవచ్చు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి శుభవార్త అందించింది. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు నగరాల మధ్య బస్ స్టాప్లను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజలకు మరింత అందుబాటులోకి రవాణా సేవలను తేనుంది.
హైదరాబాద్-బెంగళూరు కొత్త స్టాప్లు: పూర్తి వివరాలు
బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్) , అలైటింగ్ (బస్ దిగే పాయింట్) పాయింట్లను భారీగా పెంచినట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు తమకు నచ్చిన, ఉండే ప్రాంతానికి దగ్గరలోని ప్రాంతాల నుంచే సులభంగా బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా రూట్లను కింది విధంగా క్రమబద్ధీకరించారు.
పీనియా రూట్ : పీనియా (Peenya), యశ్వంతపూర్ మెట్రో స్టేషన్, కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్, ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్
చందాపూర్ రూట్ : చందాపూర్, బొమ్మసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ, బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాళ, కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ అండ్ ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
మార్తహళ్లి రూట్ : వర్తూర్ జంక్షన్, మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి, కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ అండ్ ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
ప్రయాణికులకు పెరిగిన సౌకర్యం: రూట్ల క్రమబద్ధీకరణ
బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్లు అందుబాటులో ఉంటాయి.
పటాన్చెరు రూట్ : పటాన్చెరు నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో..
జేబీఎస్ రూట్: జేబీఎస్ నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో..
హయత్నగర్ రూట్: హయత్ నగర్ నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో బోర్డింగ్/అలైటింగ్ పాయింట్లు ఉన్నాయి.
టికెట్ బుకింగ్, ఇతర సమాచారం
టీజీఎస్ఆర్టీసీ అందిస్తున్న ఈ అద్భుతమైన సదవకాశాన్ని బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. మీ ఇంటికి దగ్గరలోనే బోర్డింగ్ పాయింట్లను ఎంచుకుని, సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలని తెలిపింది.
ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవడానికి టీజీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tgsrtcbus.in ను సందర్శించవచ్చు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ కొత్త స్టాప్ల వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు మరింత సులభంగా చేరుకోవచ్చు. TGSRTC తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల సమయాన్ని, శ్రమను ఆదా చేయడమే కాకుండా, సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.


