
మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్కు స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవితేజపై ప్రశంసలు కురిపిస్తూ, ‘విక్రమార్కుడు’ కార్తీ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని సూర్య అన్నారు. ఈనెల 31న సినిమా విడుదల కానుంది.
Key Points
రవితేజ 'మాస్ జాతర' సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రవితేజ ఎనర్జీకి తాను పెద్ద ఫ్యాన్నని, ఆయన నటనకు అభిమానినని సూర్య తెలిపారు.
కార్తీ కెరీర్లో 'విక్రమార్కుడు' సినిమా టర్నింగ్ పాయింట్ అని సూర్య పేర్కొన్నారు.
మాస్ జాతర: విడుదల వివరాలు
మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు . ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది . ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా .. రవితేజ యాక్షన్ , డైలాగ్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు .
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సూర్య సందడి
రిలీజ్ కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్ . ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు . ఈ ఈవెంట్ కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈవెంట్ లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్ తో మరోసారి ఆడియన్స్ ను అలరించింది . రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు .
కార్తీ కెరీర్పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో సూర్య మాట్లాడుతూ ..’ రవితేజకు నేను కూడా అభిమానినే . ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్ . ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను . తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది . విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా . ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్ . డైరెక్టర్ భాను కల నిజం కావాలి . ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం ‘ అని అన్నారు . కాగా .. రవితేజ , శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది .
రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. సూర్య ప్రశంసలు, అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధించాలని చిత్ర బృందం ఆశిస్తోంది.


