
📌 Key Points
- పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్ల ప్రతిపాదన ప్రాథమిక దశలో పరిశీలనలో ఉంది.
- కాగితపు నోట్ల అధిక ముద్రణ ఖర్చు, త్వరగా పాడవడం వంటి సమస్యల పరిష్కారానికి ప్లాస్టిక్ నోట్లు ఆలోచన.
- 2014లో కొచ్చి, మైసూర్ వంటి 5 నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ప్రయత్నం సాంకేతిక లోపాలతో నిలిచిపోయింది.
- గతంలో నిలిచిపోయిన ప్రాజెక్ట్ను ఆర్బీఐ తిరిగి పరిశీలిస్తుండటంతో త్వరలో అందుబాటులోకి వస్తాయన్న ఊహాగానాలు.
ఆర్బీఐ త్వరలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను తీసుకువస్తుందన్న వార్తలపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలో పరిశీలనలో ఉందని తెలిపారు. కాగితపు నోట్ల అధిక ఖర్చు, పాడవడం వంటి సమస్యల పరిష్కారానికి ప్లాస్టిక్ నోట్లపై ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పాలిమర్ నోట్లపై ఆర్బీఐ పరిశీలన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను తీసుకువస్తుందన్న వార్తలపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. పాలిమర్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకువచ్చే సాధ్యాసాధ్యాలపై ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ నోట్లను ముద్రించి, వాటిని వాడకంలోకి తీసుకువస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఉపయోగాలేంటి? అన్న విషయాలపై ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. కాగితపు నోట్ల ముద్రణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం, పెద్దఎత్తున నోట్లు పాడయ్యి.. వాటిని చలామణి నుంచి తొలగించాల్సి రావడం వంటి కారణాలే ఈ ప్రతిపాదనకు దారితీసినట్లు తెలుస్తోంది.
2014 ఫిబ్రవరిలోనే.. ప్రభుత్వం పార్లమెంటుకు దీనిపై సమాచారం ఇచ్చింది. భౌగోళిక, వాతావరణ వైవిధ్యాల ఆధారంగా ఎంపిక చేసిన 5 నగరాల్లో ప్రయోగాత్మకంగా రూ.100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు అప్పట్లోనే ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ నగరాలను సెలెక్ట్ చేశారు. కానీ.. సాంకేతిక, ఆపరేషనల్ లోపాలు తలెత్తడంతో పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదనలను ఆర్బీఐ పరిశీలిస్తుండటంతో త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువస్తారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
గతంలో నిలిచిపోయిన ప్రాజెక్ట్
ప్లాస్టిక్ నోట్ల అవసరం, ప్రయోజనాలు
పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై ఆర్బీఐ గవర్నర్ ప్రకటనతో మళ్ళీ ఆశలు చిగురించాయి. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించి, ఈసారి ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి వస్తాయా లేదా అనేది వేచి చూడాలి.


