
📌 Key Points
- సాయి పల్లవి, విజయ్ సేతుపతి కాంబోలో మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం!
- ఏఆర్ రెహమాన్ సంగీతం.. జూన్ నుండి షూటింగ్ ప్రారంభం కానుందంటూ సమాచారం!
- అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో సాయిపల్లవి ‘ఏక్ దిన్’ మూవీ మే 1న విడుదల!
- తొలి షెడ్యూల్లో సాయి పల్లవి, విజయ్ సేతుపతిల పైనే సన్నివేశాల చిత్రీకరణ!
సాయి పల్లవి అభిమానులకు ఇది నిజంగా పండగే! నేచురల్ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. విజయ్ సేతుపతితో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
మణిరత్నం దర్శకత్వంలో సాయిపల్లవి, విజయ్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇప్పుడు బాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తుంది. ఇందులో బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఏక్ దిన్’ ఒకటి. అమీర్ కాన్ కుమారుడు జువైద్ ఖాన్తో ఆమె నటించి ఈ రొమాంటిక్ డ్రామాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా.. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం మే 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్న సాయి పల్లవి త్వరలోనే విజయ్ సేతుపతితో నటించే ప్రాజెక్టులో జాయిన్ భాగం కానుంది. నేచురల్ స్టార్స్గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, సాయి పల్లవి తొలిసారి కలిసి నటించనున్న చిత్రంపై అనౌన్స్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని లెజండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముండగా.. మొదటి షెడ్యూల్లో విజయ్ సేతుపతి, సాయి పల్లవిపై చిత్రీకరణ జరపనున్నట్లు టాక్. కాగా.. సంగీత ప్రపంచానికి మాంత్రికుడు అయిన ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
జూన్లో షూటింగ్ ప్రారంభం.. ఏఆర్ రెహమాన్ సంగీతం!
బాలీవుడ్లో సాయిపల్లవి ‘ఏక్ దిన్’ మూవీ రిలీజ్!
సాయి పల్లవి, విజయ్ సేతుపతిల కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


