
మంచు లక్ష్మీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. విడాకుల తర్వాత ఒక సూపర్ స్టార్ మాజీ భార్య ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు సమంతకు సంబంధించినవని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Key Points
మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు సమంతపైనా దృష్టి పడినాయి.
విడాకుల తర్వాత సమంతకు సినిమా అవకాశాలు తగ్గినట్లు సూచన.
దర్శకనిర్మాతలు సమంతకు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారా?
మహిళలు సమాజంలో ఎదుర్కొనే ఇబ్బందులను లక్ష్మీ మంచు హైలైట్ చేశారు.
మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు
నటి లక్ష్మీ మంచు తన రాబోతున్న చిత్రం ‘దక్ష: ఏ డెడ్లీ కన్స్పిరసీ’ ప్రమోషన్ సందర్భంగా ఒక సూపర్స్టార్ మాజీ భార్యకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇండైరెక్ట్ గా సమంత గురించే ప్రస్తావించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
గ్రేట్ ఆంధ్రతో ఇంటర్వ్యూలో సమంత మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆ నటి పని చేయడానికి సిద్ధంగా ఉందని, కానీ విడాకుల తర్వాత దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారని చెప్పారు. లక్ష్మీ మంచు సమంత రూత్ ప్రభు గురించి మాట్లాడిందా? అనే ప్రశ్నలుే వస్తున్నాయి. ఇంటర్వ్యూలో లక్ష్మీ రిపోర్టర్ ప్రశ్నలను తిప్పికొట్టి, మహిళలు సమాజంలో పురుషుల కంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు.
“ఒక సూపర్స్టార్ మాజీ భార్య ఇక్కడ పనిచేస్తుంది. ఆమె విడాకులు తీసుకుంది. దీంతో ముందు సైన్ చేసిన సినిమాలనూ లాక్కున్నారు. అవకాశాలు ఇవ్వడం లేదు. ఒద్దులే అమ్మ, అయినా ఏమన్నా అంటారు ఏమో అని ఆమెకు చెబుతారు. ఆమె మంచి పని చేయడానికి ఎదురు చూస్తోంది. నేను ఆమె పేరు చెప్పనవసరం లేదు” అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.
సమంతకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయా?
రిపోర్టర్ మళ్లీ సమంత రూత్ ప్రభు గురించి చెప్తున్నారా? అని స్పష్టంగా అడిగినప్పుడు మంచు లక్ష్మీ దాన్ని నిర్ధారించడానికి నిరాకరించింది. “మీరు నేను చెప్పేది సమంత గురించి అనుకుంటున్నారు. కానీ అలా ఒక్కరే లేరు. ఒక సూపర్స్టార్ లేడు. ఐదు నుండి ఆరుగురు విడాకులు తీసుకున్నారు. నాకు వాళ్లందరూ క్లోజ్. కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ఒక పురుషుడు మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోడు’’ అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
‘‘విడాకులు తీసుకున్నా పురుషుడి జీవితం మాత్రం ఎప్పటికీ మారదు. కానీ ఒక మహిళ విషయంలో ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు, అత్తమామలు ఉంటారు. ఆమె చాలా బాధ్యతలు తీసుకుంటుంది. ఎవరూ మనకు స్వేచ్ఛ ఇవ్వరు. మనకు మనం తీసుకోవాలి” అని మంచు లక్ష్మీ అన్నారు.
విడాకుల తర్వాత మహిళలు ఎదుర్కొనే సవాళ్లు
2010 చిత్రం ‘ఏ మాయ చేసావే’తో సమంత అరంగేట్రం చేశారు. ఆ తర్వాత, సమంత దక్షిణ భారతదేశంలో అత్యధికంగా రెమ్యునరేషన్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఆమె పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్, ధనుష్ లాంటి స్టార్లతో నటించింది. సమంత 2017లో నాగ చైతన్య ను పెళ్లి చేసుకుంది. ఆ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు.
2022లో సమంత మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది. ఆమె చివరిగా 2023లో ‘శకుంతలం’, ‘ఖుషి’లో కనిపించింది. ఆ తర్వాత ఏ దక్షిణ భారతీయ ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. 2024 ప్రైమ్ వీడియో షో ‘సిటాడెల్: హనీ బన్నీ’ తర్వాత ఆమె రాజ్ & డీకేతో మళ్ళీ నెట్ఫ్లిక్స్ షో ‘రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్’ కోసం జత కలుపుతోంది. చైతన్య 2024లో శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. సమంత ఇప్పుడు రాజ్ నిడిమోరును డేటింగ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
మంచు లక్ష్మీ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మహిళల స్థితి గురించి ఆలోచింపజేస్తున్నాయి. సమంత భవిష్యత్తు సినిమా ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.


