
ఆది సాయి కుమార్ మరియు అర్చన అయ్యర్ నటించిన ‘శంబాల’ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్కు సంకేతాలను ఇస్తుంది. ఓ గ్రామంలో జరిగే అనుకోని సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది.
Key Points
ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్నారు.
శంబాల టీజర్ విడుదలైంది.
పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్.
దుల్కర్ సల్మాన్ టీజర్ విడుదల చేశారు.
‘శంబాల’ టీజర్ విడుదల
Shambhala : ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు.
పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్
మీరు కూడా శంబాల టీజర్ చూసేయండి..
ఈ టీజర్ చూస్తుంటే పీరియాడిక్ సూపర్ నేచుర్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది.. టీజర్ లో.. ఆకాశం నుంచి ఓ రాయి లాంటి వస్తువు వచ్చి ఓ గ్రామంలో పడిన దగ్గర్నుంచి ఆ గ్రామంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం, మనుషులు చనిపోతుండటం జరుగుతూ ఉంటుంది. ఆ ఊరికి ఆది సాయి కుమార్ వస్తే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు, ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొనేలా చూపించారు. ఇక ఈ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసారు.
ఆ గ్రామంలోని రహస్యం
‘శంబాల’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలోని సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పూర్తి సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


