
📌 Key Points
- షావుకారు జానకి డేట్స్ ఇష్యూస్ కారణంగానే సావిత్రికి అవకాశం వచ్చిందని షాకింగ్ కామెంట్స్!
- మనంపోల మాంగల్యం సినిమాతో సావిత్రి, జెమినీ గణేషన్ మధ్య ప్రేమ చిగురించింది.
- నాలుగేళ్ల తర్వాత సావిత్రి, జెమినీ గణేషన్ పెళ్లి విషయం బయటపెట్టిన జానకి.
- సావిత్రి జీవితంలో జెమినీ గణేషన్ ఒక ముఖ్యమైన వ్యక్తి అని అందరికీ తెలుసు.
మహానటి సావిత్రి జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఆమె జెమినీ గణేషన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక స్టార్ హీరోయిన్ కారణమని మీకు తెలుసా? ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం!
షావుకారు జానకి వల్లే సావిత్రి పెళ్లి జరిగిందా?
మహానటి సావిత్రి అద్భుతమైన నటనకు ప్రతిరూపం. సహజమైన నటనతో సౌత్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటిగా ఎదిగింది. నటిగా తిరుగులేని స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న ఆమె తమిళ నటుడు జెమినీ గణేషన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయనకు అంతకు ముందే మరో పెళ్లి అయినా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆయన కారణంగానే తాగుడికి బానిస అయ్యింది. తన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంది. కోమాలోకి వెళ్లి అత్యంత ధీనమైన పరిస్థితుల్లో మరణించింది.
ఇదిలా ఉంటే సావిత్రి మద్రాస్కి వెళ్లినప్పుడు మొదట కలిసింది జెమినీ గణేషన్ని. ఆయన అప్పట్లో జెమినీ స్టూడియోలో ఆడిషన్(కాస్టింగ్) మేనేజర్గా పనిచేశారు. ఆ సమయంలోనే సావిత్రిని చూసి ఆమె ఫోటోలు తీసి నిర్మాతలకు, సినిమా స్టూడియోలకు పంపించారు. అలా సావిత్రికి సినిమా అవకాశాలు రావడంలో జెమినీ గణేషన్ పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. మొదట్లో సావిత్రి `సంసారం` చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ హీరోయిన్ పాత్ర కంటే వయసు పరంగా చిన్నగా ఉందని చెప్పి తప్పించారు. కాకపోతే అందులో చిన్న రోల్లో కొన్ని సెకన్లపాటు మెరిసింది సావిత్రి.
మనంపోల మాంగల్యం సినిమా వెనుక అసలు కథ
`పాతాళ భైరవి`, `పెళ్లి చేసి చూడు` చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సావిత్రికి `దేవదాసు` పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమాతో స్టార్ అయిపోయింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓ దశలో తెలుగు, తమిళంలో స్టార్ హీరోలకు సావిత్రినే బెస్ట్ ఆప్షన్గా మారింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్ వంటి వారు సావిత్రి డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేసింది. నటిగా ఓ ఊపు ఊపేసిన సావిత్రి జెమినీ గణేషన్తో మొదటిసారి `మనంపోల మాంగల్యం` అనే చిత్రంలో నటించారు. ఈ సినిమానే సావిత్రి కొంప ముంచింది. దీనికి స్టార్ హీరోయిన్ కారణం కావడం గమనార్హం.
`మనంపోల మాంగల్యం` చిత్రంలో జెమినీ గణేషన్ హీరో. ఆయనకు జోడీగా షావుకారు జానకి హీరోయిన్గా నటించాలి. నిర్మాతలు ఆమె వద్దకు వెళ్లారు. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ఛాన్స్ కాస్త సావిత్రికి వెళ్లిందట. అలా తాను చేయాల్సిన సినిమాలో సావిత్రి చేసిందని, ఆ మూవీతో వారిద్దరి మధ్య బాండింగ్ పెరిగిందని తెలిపింది షావుకారు జానకి. ఈ మూవీ సమయంలోనే జెమినీ గణేషన్, సావిత్రి పెళ్లి చేసుకున్నారట. కాకపోతే ఆ విషయాన్ని నాలుగేళ్ల తర్వాత వెల్లడించినట్టు జానకి తెలిపారు. `మహానటి` మూవీ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో షావుకారు జానకి ఈ విషయాలను వెల్లడించారు.
సావిత్రి జీవితంలో జెమినీ గణేషన్ పాత్ర
షావుకారు జానకి.. జెమినీ గణేషన్ని బ్రదర్ అని పిలిచేదట. ఆమెని ఆయన జానీ అనేవాడట. అయితే ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఉందని, క్లోజ్గా మాట్లాడుకునే వారట. ఆ దశలో తమని సావిత్రి అపార్థం కూడా చేసుకుందట. ఆ తర్వాత ఆమెకి తాను జెమినీని సొంత బ్రదర్ కంటే ఎక్కువగా భావిస్తానని చెప్పిందట. ఆ తర్వాత సావిత్రి తనకు సారీ చెప్పిందని వెల్లడించింది జానకి. మొత్తంగా జానకి.. `మానంపోల మాంగల్య` మూవీ చేసి ఉంటే సావిత్రి.. జెమినికి అంత క్లోజ్ అయ్యేది కాదేమో, పెళ్లి వరకు వెళ్లేవారు కారేమో, ఆమెని మనం చూసేవాళ్లమేమో.
సావిత్రి జీవితంలోని ఈ షాకింగ్ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. మరిన్ని ఆసక్తికరమైన టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


