
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రం ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. రొమాంటిక్ కామెడీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 12న విడుదల కానుంది. సిద్ధు డైలాగ్స్ ప్రోమోలో హైలైట్గా నిలిచి, ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
Key Points
సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.
సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది; ట్రైలర్ అక్టోబర్ 12న వస్తుంది.
'క్లారిటీ ఉన్న క్రాక్ నా కొడుకు' అనే డైలాగ్ ప్రోమోలో హైలైట్గా నిలిచింది.
‘తెలుసు కదా’ సినిమా విశేషాలు
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘తెలుసు కదా’ ఒకటి. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కు నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్గా నటిస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధంగా ఉండగా.. ప్రమోషనల్ కంటెంట్తో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన టీజర్కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించగా.. ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ చిన్న ప్రోమోను రిలీజ్ చేస్తూ ట్రైలర్ అక్టోబర్ 12వ తేదీన రాబోతున్నట్లు తెలిపారు. ‘స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్తోటి జాగ్రత్త’ అనే వైవా హర్ష డైలాగ్తో స్టార్ట్ అయిన ఈ ప్రోమోలో.. ‘వాళ్లు స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అయితే మనం కూడా క్లారిటీ ఉన్న క్రాక్ నా కొడుకులం కదా’ అంటూ చెప్పే సిద్ధు డైలాగ్స్ హైలెట్గా నిలిచాయి. ప్రజెంట్ ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ట్రైలర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్
ట్రైలర్ విడుదల తేదీ ఖరారు
వైరల్ అవుతున్న సిద్ధు డైలాగ్స్
సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్లతో కూడిన ప్రోమో ఇప్పటికే వైరల్ అవుతుండగా, అక్టోబర్ 12న రాబోయే పూర్తి ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది.


