📌 Key Points
- తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ సరికొత్త హోలోగ్రామ్ టెక్నాలజీతో ప్రచారం.
- ప్రతి నియోజకవర్గంలో విజయ్ త్రీడీ రూపంలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
- AI వాయిస్ మెసేజ్లు, ఇంటరాక్టివ్ వీడియోలతో టీవీకే ప్రచారం హోరెత్తిస్తోంది.
- సాంప్రదాయ పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ, టెక్నాలజీతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీ టీవీకే తన ఎన్నికల ప్రచారంలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా విజయ్ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
హోలోగ్రామ్ టెక్నాలజీతో విజయ్ ప్రచారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (TamilNadu Assembly Elections) ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే కూటమితో పాటు ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. అలాగే తమిళ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ.. రెండు కూటములకు సవాల్ విసురుతుంది. ఇదిలా ఉంటే ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో టీవీకే పార్టీ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. సమయ భావం కారణంగా అన్ని నియోజకవర్గాల్లో విజయ్ స్వయంగా పర్యటించడం సాధ్యం కానందున, పార్టీ అభ్యర్థులు ‘హోలోగ్రామ్’ (Hologram) సాంకేతికతను రంగంలోకి దించారు.
బహిరంగ సభల్లో, కీలక కూడళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలపై విజయ్ త్రీడీ (3D) రూపంలో ప్రత్యక్షమవుతున్నారు. ఆయన నిజంగానే అక్కడ నిలబడి మాట్లాడుతున్నట్లుగా ఉండే ఈ విజువల్స్ చూసి ఓటర్లు, ముఖ్యంగా యువత ఆశ్చర్యపోతున్నారు. అభ్యర్థుల పక్కనే నిలబడి విజయ్ ఓట్లు అభ్యర్థిస్తున్నట్లుగా రూపొందించిన ఈ హై-టెక్ ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
డిజిటల్ మాధ్యమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం
ఓటర్లను ఆకట్టుకుంటున్న ‘విజిల్’ జోరు
టీవీకే ఎన్నికల గుర్తు ‘విజిల్’ ప్రచారం
ఎన్నికల గుర్తు అయిన ‘విజిల్’ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీవీకే డిజిటల్ మాధ్యమాలను అస్త్రంగా వాడుకుంటోంది. కేవలం హోలోగ్రామ్ మాత్రమే కాకుండా, ఏఐ (AI) సాంకేతికతతో కూడిన వాయిస్ మెసేజ్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంటరాక్టివ్ వీడియోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గతంలో ప్రధాని మోడీ వంటి అగ్రనేతలు వాడిన ఈ హోలోగ్రామ్ టెక్నాలజీని ఇప్పుడు విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు. ఈ డిజిటల్ విప్లవం సంప్రదాయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు గట్టి పోటీనిస్తోంది. టెక్నాలజీ పరంగా ముందంజలో ఉన్న విజయ్, క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతును ఏ మేరకు కూడగడతారో తెలియాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
విజయ్ టెక్నాలజీతో ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటారో వేచి చూడాలి. ఈ డిజిటల్ విప్లవం ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


