
తెలుగు సినిమా పరిశ్రమలో తేజ సజ్జాకు మరో పెద్ద విజయం లభించింది. అతని తాజా చిత్రం ‘మిరాయ్’ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విజయంతో అతనికి లగ్జరీ కారు, అదనపు రెమ్యునరేషన్ వంటి బహుమతులు లభించాయి.
Key Points
మిరాయ్ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది.
తేజ సజ్జాకు లగ్జరీ కారుతో పాటు రూ.2 కోట్లు అదనపు రెమ్యునరేషన్.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి కూడా లగ్జరీ కారు.
జియోహాట్స్టార్ రూ.40 కోట్లకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది.
మిరాయ్ సినిమా సక్సెస్తో తేజ సజ్జాకు లాభాలు
మిరాయ్ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. గతేడాది హనుమాన్ తర్వాత తేజ సజ్జా అందించిన మరో బ్లాక్బస్టర్ ఇది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో అతని రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది. టాలీవుడ్ లో అత్యంత నమ్మదగిన హీరోల జాబితాలో అతడు చేరిపోయాడు. దీంతో అతనికి మేకర్స్ ఓ లగ్జరీ కారు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తేజ సజ్జాకు కారు, రెమ్యునరేషన్
మిరాయ్ మూవీ సక్సెస్ కావడంతో తేజ సజ్జా పంట పండింది. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడంతో అతనికి ఓ లగ్జరీ కారుతోపాటు మరో రూ.2 కోట్ల రెమ్యునరేషన్ కూడా అదనంగా ఇవ్వనున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.
రూ.100 కోట్ల క్లబ్లో మిరాయ్ ఎంట్రీ
ఈ మూవీ కోసం మొదట రెమ్యునరేషన్ గా అతనికి రూ.2 కోట్లు అందింది. ఇప్పుడు మరో రూ.2 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. తేజ తోపాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి కూడా లగ్జరీ కారు ఇవ్వబోతున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది.
మిరాయ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ బుధవారం (సెప్టెంబర్ 17) అధికారికంగా అనౌన్స్ చేశారు. లీడ్ రోల్ పోషించిన తేజ సజ్జా కూడా స్పెషల్ పోస్టర్ పోస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు.
“మళ్లీ ఈ నంబర్ సాధించాము. ఇది కేవలం మీ వల్లే సాధ్యమైంది. కృతజ్ఞుడిని” అనే క్యాప్షన్ తో అతడు ఈ ట్వీట్ చేయడం విశేషం. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా 12 రోజుల్లో ఈ మార్క్ అందుకుంది.
మేకర్స్కు భారీ లాభాలు
మిరాయ్ మూవీ మేకర్స్ పై లాభాల వర్షం కురిపిస్తోంది. నిజానికి మూవీ రిలీజ్ కు ముందే కేవలం ఓటీటీ డీల్ తోనే లాభాలు ఆర్జించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియోహాట్స్టార్ ఏకంగా రూ.40 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంటే బడ్జెట్ తో 90 శాతం వచ్చేసినట్లే.
ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేయడంతో మేకర్స్ కు మరిన్ని లాభాలు వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మిరాయ్ మూవీలో తేజ సజ్జాతోపాటు మంచు మనోజ్, జగపతిబాబు, శ్రియ శరణ్ లాంటి వాళ్లు కూడా నటించారు.
మొత్తం మీద, మిరాయ్ సినిమా తేజ సజ్జా కెరీర్కు మరో మైలురాయి. సినిమా బాక్సాఫీస్ వసూళ్లు, ఓటీటీ డీల్స్ అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.


