|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: తెలంగాణ విద్యార్థులకు షాక్! పరీక్ష తేదీల్లో సంచలన మార్పులు!

Published: 02-04-2026, 10:05 PM
Breaking: తెలంగాణ విద్యార్థులకు షాక్! పరీక్ష తేదీల్లో సంచలన మార్పులు!
  • తెలంగాణలో 1 నుంచి 9 తరగతుల ఎస్‌ఏ-2 పరీక్షల తేదీల్లో మార్పు జరిగింది.
  • ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు ఏప్రిల్ 8 నుంచే ప్రారంభం కానున్నాయి.
  • పరీక్షల సమయం తరగతిని బట్టి ఉదయం 9 గంటల నుంచి 11:30 లేదా 12 గంటల వరకు ఉంటుంది.
  • ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించబడ్డాయి.

తెలంగాణలోని విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు సంబంధించిన పరీక్షల తేదీలను విద్యాశాఖ మార్పు చేసింది. ఈ మార్పులకు గల కారణాలను, కొత్త తేదీలను ఇప్పుడు తెలుసుకుందాం.

పరీక్షల తేదీల్లో మార్పుకు కారణం ఏమిటి?

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మెుదలుకానున్నాయి. అంతకుముందు విద్యార్థులకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-2) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి.

ఎస్‌ఏ-2 పరీక్షలు ఈనెల 10 నుంచి 20వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరీక్షలు ఉన్నాయి. ఈ కారణంగా ఎస్‌ఏ 2 పరీక్షలు అన్ని కూడా రెండు రోజుల ముందు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు.

అంటే నిజానికి ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభంకావాల్సిన ఈ పరీక్షలు.. ఈనెల 8న ప్రారంభవుతాయి. ఏప్రిల్‍ 18వ తేదీతో ముగుస్తాయి. ఒకటో తరగతి నుంచి 7వ తరగతికి సంబంధించిన పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30వరకు జరుగుతాయి. అదే ఎనిమిదో తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 11.45వరకు ఉంటాయి. ఇక 9వ తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 12 వరకు జరగనున్నాయి.

కొత్త పరీక్షల తేదీలు మరియు సమయం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అధికారికంగా వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి 2026 జూన్ 11 వరకు 48 రోజుల సమ్మర్ హాలిడేస్ లభించనున్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు 2026 జూన్ 12న తిరిగి తెరుస్తారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే విద్యా సంస్థలు వారానికి అదనపు తరగతులను నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుండి ఏప్రిల్ 23, 2026 వరకు హాఫ్ డే విధానాన్ని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయి. విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

వేసవి సెలవుల వివరాలు

కొన్ని పాఠశాలలు ఎస్ఎస్‌సీ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. అటువంటి పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన రోజుల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తున్నాయి. పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులు యథావిథిగా కొనసాగుతాయి.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

కాబట్టి, విద్యార్థులు సవరించిన తేదీలను గమనించి, పరీక్షలకు సిద్ధం కావాలి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని, తిరిగి జూన్ 12న పాఠశాలలకు హాజరుకావడానికి సిద్ధంగా ఉండాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.