|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దోస్త్ వెబ్ ఆప్షన్లు షురూ! డిగ్రీ సీటు మీదేనా? ఈ కీలక తేదీలు మిస్ కావద్దు!

Published: 01-05-2026, 5:34 PM
దోస్త్ వెబ్ ఆప్షన్లు షురూ! డిగ్రీ సీటు మీదేనా? ఈ కీలక తేదీలు మిస్ కావద్దు!
  • దోస్త్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మే 8వ తేదీ వరకు కొనసాగుతుంది.
  • డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు మే 14న జరుగుతుంది.
  • రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200, ఆధార్ లింక్ తప్పనిసరి.

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త! దోస్త్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 8 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ కీలక ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవచ్చు. సీట్ల కేటాయింపు మే 14న జరగనుంది.

దోస్త్ వెబ్ ఆప్షన్ల గడువు, ప్రక్రియ

TG DOST 2026 Web Options : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా…. తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ మే 8వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఇంటర్మీడియట్ పూర్తి చేసి…. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, సబ్జెక్టులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

డిగ్రీ మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15నే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ మే 7వ తేదీతో ముగియనుంది. రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్న వారు నేరుగా వెబ్‌సైట్ ద్వారా, లేని వారు హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.

డిగ్రీ సీట్ల కేటాయింపు తేదీలు

దోస్త్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ల ఎంపిక అత్యంత కీలకమైన ఘట్టం. విద్యార్థులు ఇచ్చే ప్రాధాన్యత క్రమం ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్లు ఇచ్చాక… గడువు ముగిసే వరకు వాటిని ఎన్నిసార్లైనా మార్చుకునే (Edit) సదుపాయం ఉంటుంది.

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది.గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అందుబాటులో ఉన్న సీట్లు, వర్సిటీలు

దోస్త్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

దోస్త్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకం. సరైన ప్రాధాన్యతలతో ఆప్షన్లు ఎంచుకుని, గడువులోగా ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా కోరుకున్న డిగ్రీ సీటును పొందవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.