
📌 Key Points
- టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ మే 29న విడుదల చేయబడింది.
- అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు, కీ ని icet.tgche.ac.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- కీ పై అభ్యంతరాలను జూన్ 5 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు.
- సరైన ఆధారాలతో మాత్రమే అభ్యంతరాలను నమోదు చేయాలి.
తెలంగాణలో మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల ప్రవేశ పరీక్ష టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ విడుదలైంది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో పాటు కీని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అభ్యంతరాలను నమోదు చేసే అవకాశం ఉంది.
ఐసెట్ ప్రాథమిక కీ విడుదల: ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
రాష్ట్రంలోని మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TG ICET-2026) ప్రాథమిక కీ విడుదలైంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రెస్పాన్స్ షీట్లు, కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా మే నెలలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కీ ని మే 29 (శుక్రవారం)వ తేదీన అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు తమ ప్రాథమిక కీ ని చెక్ చేసుకోవడానికి icet.tgche.ac.in వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
అభ్యంతరాల నమోదుకు చివరి తేదీ ఎప్పుడు?
టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ లో ఏవైనా తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు గుర్తిస్తే, వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి ఉదయం 11 గంటల నుంచి జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ వేదికగా మాత్రమే ఈ అభ్యంతరాలను స్వీకరిస్తారు. సరైన ఆధారాలతో నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫలితాల ప్రకటన: అంచనాలు, తదుపరి ప్రక్రియ
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ విడుదలైన నేపథ్యంలో, అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకొని, ఏమైనా తప్పులుంటే జూన్ 5వ తేదీలోగా అభ్యంతరాలను నమోదు చేయాలి. అనంతరం తుది కీ, ఫలితాలు విడుదల కానున్నాయి.


