
టాలీవుడ్లో వేతన పెంపు కోసం ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. 30% వేతన పెంపు డిమాండ్తో కార్మికులు షూటింగ్స్కు హాజరుకావడం లేదు. నిర్మాతలు పరిమితంగానే పెంపుకు అంగీకరిస్తున్నారు.
Key Points
టాలీవుడ్ ఫిలిం ఫెడరేషన్ 30% వేతన పెంపు డిమాండ్ చేస్తుంది.
నిర్మాతలు 5-15% మాత్రమే పెంచేందుకు అంగీకరిస్తున్నారు.
ఫిలిం ఫెడరేషన్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉంది.
రేపు కృష్ణానగర్ నుండి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర, ధర్నా.
వేతన పెంపు కోసం సమ్మె
Tollywood Strike : ప్రస్తుతం టాలీవుడ్ లో ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే. వేతనాలు ఏకంగా 30 శాతం పెంచాలంటూ లేకపోతే షూటింగ్స్ కి రాము అంటూ సమ్మె చేస్తున్నారు. అటు నిర్మాతలు ఇప్పుడు టాలీవుడ్ ఉన్న పరిస్థితుల్లో పెంచలేమంటూ కావాలంటే 5 శాతం, కొంతమందికి 15 శాతం పెంచుతామని చెప్పినా ఫిలిం ఫెడరేషన్ ఒప్పుకోలేదు.
నిర్మాతలతో విభేదాలు
పాదయాత్ర మరియు ధర్నా
తాజాగా ఫిలిం ఫెడరేషన్ కార్మికులతో కలిసి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అంటున్నారు. నేడు సాయంత్రం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ లో దీనిపై మీటింగ్ జరగనుంది. రేపు ఆదివారం కృష్ణా నగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర చేసి అక్కడ ధర్నా చేయనున్నారు. అలాగే నేడు మంత్రి కోమటిరెడ్డితో కూడా ఫిలిం ఫెడరేషన్ నాయకులు మీటింగ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
టాలీవుడ్ సమ్మె తీవ్రంగా కొనసాగుతోంది. వేతన పెంపు విషయంలో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.


