
📌 Key Points
- పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
- యూఏఈ పాకిస్తాన్కు 3.5 బిలియన్ డాలర్ల అప్పు చెల్లించాలని అల్టిమేటం జారీ చేసింది.
- 1996-97లో తీసుకున్న 450 మిలియన్ డాలర్ల అప్పు కూడా ఇందులో ఉంది.
- ఏప్రిల్ చివరి వరకు చెల్లింపులు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు యూఏఈ ఊహించని షాక్ ఇచ్చింది. దాదాపు రూ.32 వేల కోట్ల అప్పును వెంటనే చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాకిస్తాన్ ఆర్థికంగా మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
యూఏఈ అల్టిమేటం జారీ
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్ కు యూఏఈ మరో ఊహించని షాక్ ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ అల్టిమేటం జారీ చేసింది. తామిచ్చిన 3.5 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది యూఏఈ. 1996-97 సమయంలో తీసుకున్న 450 మిలియన్ డాలర్ల అప్పు కూడా ఇందులో ఉంది. ఇలా మొత్తంగా రూ.32 వేల కోట్లు ( ఇండియన్ రూపాయాలలో) యూఏఈకి పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి
ఈ ఏప్రిల్ చివరి వరకు తీసుకున్న మొత్తం చెల్లించేందుకు కూడా పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంకులోని రిజర్వుల ద్వారా మూడో విడతల్లో చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఒకవేళ సమయానికి డబ్బులు అడ్జస్ట్ కాకపోయినా అప్పులో సగమైన ఈ నెల ఆఖరు వరకు కట్టే ఛాన్సులు ఉన్నాయి. కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఎఫెక్ట్ తో పాకిస్తాన్ చమురు నిల్వలు పూర్తిగా తగ్గాయి. దీంతో ధరలు కూడా పెరిగాయి.
చెల్లింపులకు పాక్ ప్రయత్నాలు
ఇరాన్ అణు ప్లాంట్పై క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం!
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. యూఏఈ అప్పు చెల్లించాలని గడువు విధించడంతో పరిస్థితి మరింత దిగజారేలా ఉంది. ఈ పరిణామాలు పాకిస్తాన్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.


